దుబాయ్:పార్కింగ్ చేసిన కారులో వ్యక్తి మృతదేహం
- August 23, 2018
దుబాయ్:పార్కింగ్ చేసిన కారులో ఓ వ్యక్తి మృతదేహం వుండడానికి సంబంధించి సమాచారం అందుకోగానే పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు జిసిసి జాతీయుల్ని అరెస్ట్ చేశారు. వారే 19 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నాడ్ అల్ హమార్లోని శాండీ ఏరియాలో పార్క్ చేసిన కారులో మృతదేహం లభ్యమయ్యింది. అరెస్టయినవారిలో ఓ వ్యక్తి, మృతుడి బంధువే కావడం గమనార్హం. చిన్నపాటి గొడవ ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవ పెరిగి, నిందితులు ఆ వ్యక్తిని పొడిచి చంపారు. హత్య అనంతరం, మృతదేహాన్ని కారులో తీసుకెళ్ళి దూరంగా విడిచిపెట్టి వచ్చేశారు. కారుని తగలబెట్టేందుకూ నిందితులు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







