దుబాయ్:పార్కింగ్ చేసిన కారులో వ్యక్తి మృతదేహం
- August 23, 2018
దుబాయ్:పార్కింగ్ చేసిన కారులో ఓ వ్యక్తి మృతదేహం వుండడానికి సంబంధించి సమాచారం అందుకోగానే పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు జిసిసి జాతీయుల్ని అరెస్ట్ చేశారు. వారే 19 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నాడ్ అల్ హమార్లోని శాండీ ఏరియాలో పార్క్ చేసిన కారులో మృతదేహం లభ్యమయ్యింది. అరెస్టయినవారిలో ఓ వ్యక్తి, మృతుడి బంధువే కావడం గమనార్హం. చిన్నపాటి గొడవ ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవ పెరిగి, నిందితులు ఆ వ్యక్తిని పొడిచి చంపారు. హత్య అనంతరం, మృతదేహాన్ని కారులో తీసుకెళ్ళి దూరంగా విడిచిపెట్టి వచ్చేశారు. కారుని తగలబెట్టేందుకూ నిందితులు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







