దుబాయ్:పార్కింగ్ చేసిన కారులో వ్యక్తి మృతదేహం
- August 23, 2018
దుబాయ్:పార్కింగ్ చేసిన కారులో ఓ వ్యక్తి మృతదేహం వుండడానికి సంబంధించి సమాచారం అందుకోగానే పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు జిసిసి జాతీయుల్ని అరెస్ట్ చేశారు. వారే 19 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నాడ్ అల్ హమార్లోని శాండీ ఏరియాలో పార్క్ చేసిన కారులో మృతదేహం లభ్యమయ్యింది. అరెస్టయినవారిలో ఓ వ్యక్తి, మృతుడి బంధువే కావడం గమనార్హం. చిన్నపాటి గొడవ ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవ పెరిగి, నిందితులు ఆ వ్యక్తిని పొడిచి చంపారు. హత్య అనంతరం, మృతదేహాన్ని కారులో తీసుకెళ్ళి దూరంగా విడిచిపెట్టి వచ్చేశారు. కారుని తగలబెట్టేందుకూ నిందితులు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









