వెదర్‌ రిపోర్ట్‌: 48 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత

- August 24, 2018 , by Maagulf
వెదర్‌ రిపోర్ట్‌: 48 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత

యూఏఈలో అత్యధిక ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకుంది. పగటి వేళల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న రోజుల్లోనూ ఈ వేడి వాతావరణం కొనసాగనుంది. దేశంలో అత్యధికంగా రికార్డ్‌ అయిన ఉష్ణోగ్రత 48.5 డిగ్రీల సెల్సియస్‌. గాలుల వేగం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది గంటకు 38 కిలోమీటర్ల వేగం వరకు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. ఆదివారం పలు చోట్ల హ్యుమిడిటీ ఎక్కువగా నమోదవుతుంది. కొన్ని చోట్ల మేఘాలూ కనిపిస్తాయి. సోమవారం సైతం వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. వేడి వాతావరణం, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదురవుతాయి. మంగళవారం సైతం వాతావరణంలో పెద్దగా మార్పులుండవు. అయితే గాలుల వేగంలో మాత్రం మార్పులు చోటు చేసుకోవచ్చు. అరేబియన్‌ గల్ఫ్‌ మరియు ఒమన్‌ సీలలో మోడరేట్‌ వాతావరణం కన్పిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com