వెదర్ రిపోర్ట్: 48 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత
- August 24, 2018
యూఏఈలో అత్యధిక ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకుంది. పగటి వేళల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న రోజుల్లోనూ ఈ వేడి వాతావరణం కొనసాగనుంది. దేశంలో అత్యధికంగా రికార్డ్ అయిన ఉష్ణోగ్రత 48.5 డిగ్రీల సెల్సియస్. గాలుల వేగం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది గంటకు 38 కిలోమీటర్ల వేగం వరకు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. ఆదివారం పలు చోట్ల హ్యుమిడిటీ ఎక్కువగా నమోదవుతుంది. కొన్ని చోట్ల మేఘాలూ కనిపిస్తాయి. సోమవారం సైతం వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. వేడి వాతావరణం, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదురవుతాయి. మంగళవారం సైతం వాతావరణంలో పెద్దగా మార్పులుండవు. అయితే గాలుల వేగంలో మాత్రం మార్పులు చోటు చేసుకోవచ్చు. అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ సీలలో మోడరేట్ వాతావరణం కన్పిస్తుంది.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







