ఇండియన్ నేవీ కోసం హెలికాప్టర్ల కొనుగోలుకు డీఏసీ ఆమోదం
- August 25, 2018
ఇండియన్ నేవీ కోసం హెలికాప్టర్ల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. 24 మల్టీ రోల్ హెలికాప్టర్లతోపాటు ఇతర కొనుగోళ్ళకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి 46 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా పథకానికి ఊపునిచ్చేందుకు చేపట్టిన వ్యూహాత్మక భాగస్వామ్యం విధానంలో ఇది తమ తొలి ప్రాజెక్టు అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ విధానంలో విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశ వ్యూహాత్మక భాగస్వామికి బదిలీ చేస్తారని, ఇండియన్ స్ట్రాటజిక్ పార్టనర్ భారీ రక్షణ పరికరాలను భారతదేశంలోనే తయారు చేస్తారని వివరించింది.
డీఏసీ అనుమతులకు 18 నెలల గడువు ఉంటుంది. ఈ గడువులోగా భారత నావికా దళం ఈ ప్రక్రియను అమల్లో పెట్టాలి. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్ ఎంపిక చేయాలి. ఆ ఓఈఎం తగిన ఇండియన్ పార్టనర్ను సమకూర్చుకుని, భారతదేశంలో హెలికాప్టర్లను తయారు చేయవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







