ఇండియన్ నేవీ కోసం హెలికాప్టర్ల కొనుగోలుకు డీఏసీ ఆమోదం
- August 25, 2018
ఇండియన్ నేవీ కోసం హెలికాప్టర్ల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. 24 మల్టీ రోల్ హెలికాప్టర్లతోపాటు ఇతర కొనుగోళ్ళకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి 46 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా పథకానికి ఊపునిచ్చేందుకు చేపట్టిన వ్యూహాత్మక భాగస్వామ్యం విధానంలో ఇది తమ తొలి ప్రాజెక్టు అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ విధానంలో విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశ వ్యూహాత్మక భాగస్వామికి బదిలీ చేస్తారని, ఇండియన్ స్ట్రాటజిక్ పార్టనర్ భారీ రక్షణ పరికరాలను భారతదేశంలోనే తయారు చేస్తారని వివరించింది.
డీఏసీ అనుమతులకు 18 నెలల గడువు ఉంటుంది. ఈ గడువులోగా భారత నావికా దళం ఈ ప్రక్రియను అమల్లో పెట్టాలి. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్ ఎంపిక చేయాలి. ఆ ఓఈఎం తగిన ఇండియన్ పార్టనర్ను సమకూర్చుకుని, భారతదేశంలో హెలికాప్టర్లను తయారు చేయవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







