బహ్రెయిన్:కార్ల దొంగలకు మూడేళ్ళ జైలు
- August 27, 2018
బహ్రెయిన్:కార్లను దొంగిలించి, ఆ కార్లను డిస్ అసెంబ్లింగ్ చేసి పార్టులు పార్టులుగా వాటిని విక్రయిస్తోన్న ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ కెమెరాలను పరిశీలించిన అనంతరం అత్యంత చాకచక్యంగా నిందితుల్ని గుర్తించారు. ముందుగా వాహనాల్ని టౌల్ చేసి, ఆ తర్వాత ఆ వాహనాల్ని ఇసా టౌన్ వైపుకు తీసుకెళ్ళి, అక్కడ వాహనాన్ని డిస్ అసెంబ్లింగ్ చేస్తున్నారు నిందితులు. ముందుగా టౌలింగ్ కార్ని డిటెక్టివ్స్ గుర్తించారు. ఆ నెంబర్ ఆధారంగా ఆ వాహన ఓనర్ని ప్రశ్నిస్తే, మొత్తం బండారం బయటపడింది. 2017 నుంచి 2018 వరకు పలు కార్లను నిందితులు దొంగిలించినట్లు పోలీసులు తేల్చారు. న్యాయస్థానం నిందితులకు మూడేళ్ల జైలు శిక్షను విధించింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







