కారులో ప్రయాణించేటప్పుడు ఈ పనులు తప్పకుండా చెయ్యాలి...
- August 29, 2018
కారు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.అయితే అందుకు కారణం సరైన జాగ్రత్తలుపాటించడంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కారులో ప్రయాణించే ముందు అందులోని ప్రతి ఒక్కరు తప్పకుండా సీటు బెల్టు ధరించాలి.అన్ని సమయాల్లో సీటు బెల్టు అక్కరలేదనుకుంటే పొరపాటే..దురదృష్టవశాత్తు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైతే కచ్చితంగా సీటుబెల్టు రక్షిస్తుంది. కారులో సీటుకు అమర్చిఉండే బెల్టు కారు ప్రమాదానికి గురైనపుడు.. మనిషిని ముందుకు వెనక్కి పడకుండా ఆపుతుంది.అంతేకాకుండా ఆ సమయాల్లో కారు డోర్లు విరిగిపోయినా సీటు బెల్టు కారణంగా ప్రయాణికుడు బయటకు పడిపోడు. దీంతో కొంత మేర ప్రమాదం నుండి బయటపడవచ్చు. సీటు బెల్టు పెట్టుకున్న వారిలో 100 శాతం ప్రమాదాలకు గురికారాని నిపుణులు చెబుతున్నారు. అలాగే కారులో ప్రయాణించేటప్పుడు చేయాల్సిన మరో ముఖ్యమైన పని సీటు బెల్టు అలారం లను లాక్ చెయ్యకుండా ఉండటం. ఒకవేళ అవి లాక్ చేస్తే సీటు బెల్టు ధరించలేదన్న విషయం మరచిపోవచ్చు.. కాబట్టి అలారం ఇండికేషన్ లాక్ చెయ్యకూడాదు. ఇక పోతే కారు ప్రమాదాలకు గురైనప్పుడు కారులో ఉండే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని ప్రయాణికుడికి రక్షణగా నిలుస్తాయి. ఇవి కూడా కొన్ని సమయాల్లో పనిచేయవని కొందరు నిపుణులు అంటున్నారు.ఇందుకు కారణం అవి స్టక్ అయిపోవడమే.. వెహికల్ లను సర్వీసింగ్ కు ఇచ్చే సమయాల్లో ఎయిర్ బ్యాగ్స్ ను పిన్ టు పిన్ చెక్ చేయించాలి లేదంటే.. అందులోకి దుమ్ము ధూళి చేరి స్టక్ అవుతాయి.ఇప్పుడు వస్తున్న కొన్ని కార్లలో సీటు బెల్టుకు కూడా ఎయిర్ బ్యాగ్స్ కనెక్టింగ్ ఉంటుందని అంటున్నారు నిపుణులు. అయితే ఎయిర్ బ్యాగ్స్ ముఖ్యంగా వెహికల్ ప్రమాదానికి గురైనపుడు సెన్సార్ కారణంగానే ఓపెన్ అవుతాయనేది అందరికి తెలిసిన విషయం.కానీ కొన్ని కార్లకు సీటు బెల్టు పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయని అంటున్నారు.అలాగే డ్రైవర్లు కారు డ్రైవ్ చేయడానికంటే ముందు ఇంజిన్ కండీషన్, బ్రేకులు వంటివి సరిచూసుకోవాలి. ఇంకో అతిముఖ్యమైనది మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండటం శ్రేయస్కరం.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









