మహా ప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు..
- August 29, 2018
హైదరాబాద్:నందమూరి కుటుంబంలో పెను విషాదం.. టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ మరణం నందమూరి కుటుంబాన్ని దుఃఖ సాగరంలోకి నెట్టింది. నాలుగేళ్ల కిందట పెద్దకొడుకు మరణం.. ఇప్పుడు అదే తరహాలో మృత్యువు హరికృష్ణను కబళించింది.. హరికృష్ణ అంత్యక్రియలు ఈరోజు మహాప్రస్థానంలో జరగనున్నాయి. హరికృష్ణ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది.
సినీ, రాజకీయాల్లో డేరింగ్ పర్సనాలిటీగా పేరున్న నందమూరి హరికృష్ణ హఠాన్మరణం తెలుగు ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, మాజీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరికృష్ణ అంత్యక్రియలు ఈ రోజు ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
కల్మషం లేని వ్యక్తిగా ఎంతో మంది ఆప్తులను సంపాదించుకున్న హరికృష్ణను..కడసారి చూసేందుకు అభిమానులు మోహదీపట్నంలోని ఆయన ఇంటికి భారీగా తరలొస్తున్నారు. సినీ, రాజకీయ నేతలు ఆయన పార్ధివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆప్తులు, అభిమానుల సందర్శనార్థం హరికృష్ణ భౌతికకాయన్ని మోహదీపట్నంలోనే ఉంచుతారు. మధ్యాహ్నం రెండున్నర తర్వాత అంతిమయాత్రం ప్రారంభం అవుతుంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
హరికృష్ణ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన కేసీఆర్ చంద్రబాబుతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. అంతిమ సంస్కారాలపై ఇరువురు చర్చించారు. అనంతరం కేసీర్ అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. నివాసం వద్ద భద్రతతో పాటు.. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ను దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అటు ఏపీ ప్రభుత్వం హరికృష్ణ అకాల మృతి పట్ల రెండు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. ఇక అంతిమయాత్రకు నందమూరి అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలొచ్చే అవకాశాలు ఉండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు అన్నగారి రథసారధిగా చైతన్య రథాన్ని నడిపించిన హరికృష్ణ అంతిమయాత్రను అదే చైతన్య రథం మీద నిర్వహించే ఆలోచన ఉన్నారు నందమూరి కుటుంబ సభ్యులు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







