పెరిగిన బంగారం ధర
- August 30, 2018
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో పసిడి ధర పెరిగింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.120 పెరిగి రూ.31,200కు చేరింది. పండుగల సీజన్ కావడంతో వినియోగదారుల డిమాండ్ను చేరుకోవడానికి నగల వ్యాపారుల కొనుగోళ్లు బాగా పెరిగాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కూడా సానుకూలత ఉందని తెలిపాయి.
నేటి బులియన్ మార్కెట్లో వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా రూ.38,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.48శాతం పెరిగి 1206.30డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.24శాతం పెరిగి 14.73డాలర్లుగా ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒక దశలో రూ.70.82కు పడిపోవడంతో దిగుమతుల వ్యయం పెరుగుతోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!