పెరిగిన బంగారం ధర
- August 30, 2018
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో పసిడి ధర పెరిగింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.120 పెరిగి రూ.31,200కు చేరింది. పండుగల సీజన్ కావడంతో వినియోగదారుల డిమాండ్ను చేరుకోవడానికి నగల వ్యాపారుల కొనుగోళ్లు బాగా పెరిగాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కూడా సానుకూలత ఉందని తెలిపాయి.
నేటి బులియన్ మార్కెట్లో వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా రూ.38,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.48శాతం పెరిగి 1206.30డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.24శాతం పెరిగి 14.73డాలర్లుగా ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒక దశలో రూ.70.82కు పడిపోవడంతో దిగుమతుల వ్యయం పెరుగుతోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







