కేరళకు దక్షిణాది తారల విరాళం..
- September 01, 2018
పదిరోజులపాటు పాటు ఉప్పొంగిన వరదలకు కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆపదలో ఉన్న కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు వేలాదిమంది ముందుకు వచ్చారు. ఈ క్రమంలో దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో 1980ల నాటి సినీ తారలంతా తమ వంతుగా 40 లక్షల రూపాయల విరాళం అందించారు.
’80’s సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్’ పేరుతో కేరళ వరద బాధితుల ఈ భారీ విరాళాన్నిచ్చింది.1980ల నాటి నటీమణులంతా స్పందించి 40 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.. ఈ చెక్కును శుక్రవారం కేరళ సీఎంను కలిసి అందజేసినట్టు సీనియర్ హీరోయిన్ సుహాసిని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేశారు. గాడ్స్ ఓన్ కంట్రీ వాసులు పూర్తిగా కోలుకునేలా తమ వంతు సహాయాన్నందించేందుకు నిర్ణయించామని నటి కుష్బు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







