'జనసేన టీమ్-కువైట్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

- September 01, 2018 , by Maagulf

కువైట్:జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 47 వ జన్మదిన  వేడుకలు ఆగస్ట్ 31 తేదీన కువైట్,ఖైతాన్ ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ లో 'జనసేన టీమ్ కువైట్' ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.భారత్ దేశం నుంచి ముఖ్య అతిధిగా విచ్చేసిన తాతంశెట్టి నాగేంద్ర కేక్ కట్ చేసారు.తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.సెప్టెంబర్ 2న  'జనసేన టీమ్ కువైట్' ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయనున్నారు. 

ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు పవన్ కళ్యాణ్  జన్మదిన  వేడుకలకు  విచ్చేసిన ప్రతి జనసేన పార్టీ కార్యకర్తకు పేరు పేరునా  ధన్యవాదములు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com