ఖతార్ కు సౌదీ అరేబియా షాక్...!
- September 01, 2018
రియాద్ : సౌదీ అరేబియా-ఖతార్.. దాదాపు ఏడాది క్రితం ఈ రెండు దేశాలది ఒకేమాట. కానీ అంతర్జాతీయ వేదికలపై ఇరాన్కు మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. ఖతార్ ఉగ్రసంస్థలను ప్రోత్సహిస్తోందంటూ సౌదీ ఆరోపించింది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఖతార్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలను తమ విమానాశ్రయాలో ఎట్టిపరిస్థితుల్లో ల్యాండింగ్ అయ్యేందుకు అనుమతించమని సౌదీ అరేబియా వెల్లడించింది. దీంతో, యూఏఈ, ఈజిప్టు, బహ్రెయిన్ సహా పలు అరబ్ దేశాలు ఇదే బాట పట్టాయి. అయినా ఖతార్ లొంగకపోవడంతో ఈసారి సౌదీ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. సౌదీ-ఖతార్ దేశాల మధ్య వివాదం ముదిరింది. ఇరుదేశాలను కలుపుతున్న భూభాగం మధ్యలో కాలువను తవ్వాలని సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రణాళికలు రచిస్తున్నారు. తద్వారా ఇప్పటివరకూ ఒక వైపున భూభాగంతో అనుసంధానమై ద్వీపకల్పంగా ఉన్న ఖతార్ను ద్వీపంగా మార్చేసి మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.53,152 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా 60 కిలోమీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో కాలువను తవ్వనున్నారు.
ఈ కాలువలోనే అణు విద్యుత్ కేంద్రాల్లో మిగిలిపోయిన వ్యర్థాలను నిల్వ చేసేందుకు ప్రత్యేకమైన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కాలువ నిర్మాణం కోసం సౌదీ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







