'బ్లూవేల్'కు బలైన ఇంజనీర్
- September 05, 2018
ప్రపంచాన్ని భయపెట్టిన బ్లూవేల్ గేమ్కు మరొకరు బలయ్యారు. ఈ ఆట ఆటాడిన ఇంజినీర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని కడలూరు పన్రూట్టిలోని అంగుచెట్టిపాళయానికి చెందిన శేషాద్రి (22) ఇంజినీరింగ్ పూర్తి చేసి పుదుచ్చేరి మెట్టుపాళయంలోని ఓ ప్రవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి యథావిధిగా విధులు ముగించుకుని ఇంటికొచ్చిన శేషాద్రి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పుదుపేట పోలీసులు శేషాద్రి ఇంటికి చేరుకుని అతని గదిని పరిశీలించగా దెయ్యాల కథల పుస్తకాలు కనిపించాయి. శేషాద్రి సెల్ఫోన్ను చూసిన పోలీసులు బ్లూవేల్ గేమ్ ఆడినట్టు గుర్తించారు. బ్లూవేల్ గేమ్లో మానసిక ఒత్తిడి కారణంగానే శేషాద్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







