రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కార్మికుడు
- September 06, 2018
ఢిల్లీ:కోటీశ్వరులం కావాలంటే ఎంతో కష్టపడి పని చేసి సంపాదిస్తే కానీ కాలేం. అహర్నిశలు కష్టపాడాలి. కానీ ఓ కార్మికుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అప్పు చేసిమరీ తన అదృష్టం పరీక్షించుకున్నాడు. రూ.200 పెట్టి లాటరీ టికెట్ కొన్న అతడికి ఏకంగా 1.5 కోట్ల రూపాయల జాక్పాట్ తగిలింది. పంజాబ్లోని సంగ్రూర్ జిల్లా వాసి మనోజ్ కుమార్ తొలుత ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. వాస్తవానికి లాటరీ టికెట్ కొనడానికి అవసరమైన రూ.200 కూడా లేకపోవడంతో సహచరుడి దగ్గర అప్పుచేసినట్టు అతడు పేర్కొన్నాడు. తన లాటరీ టికెట్ నెంబర్ విన్నింగ్ నంబర్తో సరిపోలడంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. ''అంతా కలలా ఉంది. లాటరీ టికెట్ కొనడానికి నేను అప్పుచేశాను. ఇంత డబ్బు గెలుచుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు..'' అంటూ మనోజ్ సంతోషం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!