రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కార్మికుడు
- September 06, 2018
ఢిల్లీ:కోటీశ్వరులం కావాలంటే ఎంతో కష్టపడి పని చేసి సంపాదిస్తే కానీ కాలేం. అహర్నిశలు కష్టపాడాలి. కానీ ఓ కార్మికుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అప్పు చేసిమరీ తన అదృష్టం పరీక్షించుకున్నాడు. రూ.200 పెట్టి లాటరీ టికెట్ కొన్న అతడికి ఏకంగా 1.5 కోట్ల రూపాయల జాక్పాట్ తగిలింది. పంజాబ్లోని సంగ్రూర్ జిల్లా వాసి మనోజ్ కుమార్ తొలుత ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. వాస్తవానికి లాటరీ టికెట్ కొనడానికి అవసరమైన రూ.200 కూడా లేకపోవడంతో సహచరుడి దగ్గర అప్పుచేసినట్టు అతడు పేర్కొన్నాడు. తన లాటరీ టికెట్ నెంబర్ విన్నింగ్ నంబర్తో సరిపోలడంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. ''అంతా కలలా ఉంది. లాటరీ టికెట్ కొనడానికి నేను అప్పుచేశాను. ఇంత డబ్బు గెలుచుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు..'' అంటూ మనోజ్ సంతోషం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







