అమెరికాలోని బ్యాంకులో జరిపిన కాల్పుల్లో తెలుగు వ్యక్తి మృతి
- September 06, 2018
న్యూయార్క్ : అమెరికాలోని ఒక బ్యాంక్లో గురువారం ఒక దుండగుడు జరిపిన కాల్పుల ఘటనలో గుంటూరుకు చెందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సిన్సినాటిలోని ఫౌంటైన్ స్క్వేర్కు సమీపంలోని ఒక బ్యాంకును దోచుకునేందుకు దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన పృథ్వీరాజ్ కెండెపి (26) మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పృథ్వీ బ్యాంకులో కన్సల్టెంట్గా పనిచేస్తున్నారని తానా అధికారి పేర్కొన్నారు. లూయిస్ కార్డోలెస్, రిచర్డ్లు ఈ ఘటనలో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం జరిపిన పోలీస్ కాల్పుల్లో దుండగుడు మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, దుండగుడు గతంలో అదే బ్యాంకులో పనిచేశాడని వారు తెలిపారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..