అమెరికాలోని బ్యాంకులో జరిపిన కాల్పుల్లో తెలుగు వ్యక్తి మృతి
- September 06, 2018
న్యూయార్క్ : అమెరికాలోని ఒక బ్యాంక్లో గురువారం ఒక దుండగుడు జరిపిన కాల్పుల ఘటనలో గుంటూరుకు చెందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సిన్సినాటిలోని ఫౌంటైన్ స్క్వేర్కు సమీపంలోని ఒక బ్యాంకును దోచుకునేందుకు దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన పృథ్వీరాజ్ కెండెపి (26) మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పృథ్వీ బ్యాంకులో కన్సల్టెంట్గా పనిచేస్తున్నారని తానా అధికారి పేర్కొన్నారు. లూయిస్ కార్డోలెస్, రిచర్డ్లు ఈ ఘటనలో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం జరిపిన పోలీస్ కాల్పుల్లో దుండగుడు మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, దుండగుడు గతంలో అదే బ్యాంకులో పనిచేశాడని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







