మెక్సికో:166 మందిని చంపి పాతిపెట్టిన కిరాతకులు
- September 07, 2018
మెక్సికో:తమ అకృత్యాలకు, అక్రమ దందాకు అడ్డొచ్చిన ఎంతమందిని అయినా చంపి వేయడం మనం ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. అచ్చం అలాంటి సంఘటనే నిజ జీవితంలో జరిగింది. తూర్పు మెక్సికోలోని వెరక్రూజ్ ప్రాంతంలో 166 మంది పౌరుల మృతదేహాలను పోలీసులు గుర్తించడం దేశంలో సంచలనం సృష్టించింది.
వీరంతా ఎవరు..? ఇంతమందిని ఎవరు చంపి ఉంటారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలలో విచ్చలవిడిగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న మాఫియాతో ఇక్కడి ప్రజలు పోరాడుతున్నారు. ఆ ముఠాతో జరిగిన ఘర్షణల్లో 166 మందిని చంపి, పాతిపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఆగస్టు 8న తవ్వకాలు ప్రారంభించిన పోలీసులకు 166 పుర్రెలు, 200 దుస్తులు, 144 ఐడీ కార్డులు లభించాయి. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం రెండేళ్ల క్రితం వారిని చంపి ఉంటారని తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతం ఎక్కడుందో మెక్సికో ప్రభుత్వం ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









