యూఏఈ ఆమ్నెస్టీ: 25,000 కొత్త వీసాల్ని మంజూరు చేసిన అమెర్ సెంటర్స్
- September 08, 2018
యూఏఈ:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) - దుబాయ్, 25,000 కొత్త స్పాన్సర్ వీసాల్ని మంజూరు చేయగా, 2,900 రెసిడెన్సీ వీసాల్ని రెన్యూవల్ చేసినట్లు పేర్కొంది. 'ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' పేరుతో ప్రారంభించిన కార్యక్రమం అక్టోబర్ 31న పూర్తి కానున్న దరిమిలా, అమెర్ సెంటర్స్ ఇప్పటికే 32,843 ట్రాన్సాక్షన్స్ని పూర్తి చేసింది. ఆగస్ట్ 1న అమ్నెస్టీ ప్రారంభమయ్యింది. జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, అమెర్ సెంటర్స్ 7,757 రెసిడెన్సీ వయోలేటర్స్తో సంబంధమున్న కేసుల్ని ఫినిష్ చేసినట్లు తెలిపారు. 2,344 వీసాల్ని క్యాన్సిల్ చేయగా, 2,916 వీసాల్ని రెన్యూ చేయడంతోపాటు 25,086 కొత్త స్పాన్సర్ వీసాల్ని మంజూరు చేయడం జరిగిందని వివరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి