యూఏఈ ఆమ్నెస్టీ: 25,000 కొత్త వీసాల్ని మంజూరు చేసిన అమెర్‌ సెంటర్స్‌

- September 08, 2018 , by Maagulf
యూఏఈ ఆమ్నెస్టీ: 25,000 కొత్త వీసాల్ని మంజూరు చేసిన అమెర్‌ సెంటర్స్‌

యూఏఈ:జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారినర్స్‌ ఎఫైర్స్‌ (జిడిఆర్‌ఎఫ్‌ఎ) - దుబాయ్‌, 25,000 కొత్త స్పాన్సర్‌ వీసాల్ని మంజూరు చేయగా, 2,900 రెసిడెన్సీ వీసాల్ని రెన్యూవల్‌ చేసినట్లు పేర్కొంది. 'ప్రొటెక్ట్‌ యువర్‌సెల్ఫ్‌ బై మాడిఫైయింగ్‌ యువర్‌ స్టేటస్‌' పేరుతో ప్రారంభించిన కార్యక్రమం అక్టోబర్‌ 31న పూర్తి కానున్న దరిమిలా, అమెర్‌ సెంటర్స్‌ ఇప్పటికే 32,843 ట్రాన్సాక్షన్స్‌ని పూర్తి చేసింది. ఆగస్ట్‌ 1న అమ్నెస్టీ ప్రారంభమయ్యింది. జిడిఆర్‌ఎఫ్‌ఎ డైరెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ మొహమ్మద్‌ అహ్మద్‌ అల్‌ మర్రి మాట్లాడుతూ, అమెర్‌ సెంటర్స్‌ 7,757 రెసిడెన్సీ వయోలేటర్స్‌తో సంబంధమున్న కేసుల్ని ఫినిష్‌ చేసినట్లు తెలిపారు. 2,344 వీసాల్ని క్యాన్సిల్‌ చేయగా, 2,916 వీసాల్ని రెన్యూ చేయడంతోపాటు 25,086 కొత్త స్పాన్సర్‌ వీసాల్ని మంజూరు చేయడం జరిగిందని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com