బహ్రెయిన్ లో తెలుగు వారి 'భాగవత కథామృతం'
- December 17, 2015
బహ్రెయిన్ లో కన్నుల పండుగగా 'భాగవత కథామృతం' ఇస్కాన్ సంస్థల ఆధ్వర్యం లో ప్రత్యేకముగా తెలుగు వారు అంతా కలసి మొట్ట మొదటి సారిగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమము ఆధ్యంతం భక్తి భావాలు పెంపొందించే విధంగా సంస్కృతీ సాంప్రదాయాలు ప్రజలు కి తెలియపరిచే విధంగా గౌరవ నీయులు పూజ్య శ్రీ సత్య గోపినాద్ దాస్ ప్రభు జి తన ప్రవచనం లో తెలియజేసారు . ఈ కార్యక్రమము లో తెలుగు వారు అంతా కుటుంబ సమేతం గా పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచానాలును మరియు భగవంతుని లీల విశేషాలను కళాపోషకులు ద్వారా తెలుసుకుంటున్నారు. శ్రీ భాగవత కథమృతం ఇంత అధ్భుతంగా జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి చరిత్ర లో నిలిచిపోవాలి అని గౌరవ నీయులు పూజ్య శ్రీ సత్య గోపినాద్ దాస్ ప్రభు జి అన్నారు . ఇంత ఘనంగా కార్యక్రమమును ముందుకు నడిపించినటువంటి శ్రీ గౌరవనీయులు అర్ .వి .రావు గారు ని మోహన్ మురళీధర్ గారిని ఘనంగా సన్మానించారు. పెద్ద మనసు తో ముందుకు వచ్చినందుకు శ్రీ గౌరవ నీయులు హరిబాబు గారు మరియు కమిటి సభ్యులు వారిని అభినందించారు. మా మీడియా ప్రతినిధి వాసుదేవరావు గారు కూడా పాల్గున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గల్ఫ్ లో జరుపుకోవడం ప్రజలు లో మంచి భావాలు పెంపొందుతాయి అని అన్నారు .
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)




తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







