చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి..భారత్ లోకి చొచ్చుకొస్తున్న చైనా బలగాలు

- September 12, 2018 , by Maagulf
చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి..భారత్ లోకి చొచ్చుకొస్తున్న చైనా బలగాలు

భారత సరిహద్దులో చైనా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చైనా బలగాలు గత నెలలో ఉత్తరాఖండ్‌ చమోలీ జిల్లాలో వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 4కిలోమీటర్ల లోపలికి వచ్చాయట. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ బలగాలు ఆగస్టు 6, 14, 15 తేదీల్లో భారత భూభాగంలోకి ప్రవేశించాయని సదరు వర్గాలు తెలిపాయి.అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. గతేడాది జులై 25న కూడా బారాహొటి ప్రాంతంలో కిలోమీటరు లోపలికి చైనా బలగాలు ప్రవేశించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2013, 2014లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com