గణేష్ ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్లో భారీ భద్రత
- September 12, 2018
హైదరాబాద్:గణేష్ ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి 14వేల మందిని మంటపాల వద్ద సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నారు. ప్రతి చోట విగ్రహాల ప్రతిష్టాపనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ముందస్తుగానే చేస్తున్నందున.. అక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకూ 8వేల మంటపాల్లో విగ్రహాలు కొలువుదీరాయి. అటు, రాత్రి సమయాల్లో ప్రతి మంటపం వద్ద కనీసం ఇద్దరు ఉండి ఏర్పాట్లు, భద్రత చూసుకునేలా ప్లాన్ చేశారు. ఉత్సవాలు ముగిసాక ఆఖరు రోజున నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఇప్పటి నుంచే సెక్యూరిటీ పటిష్టం చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకూ 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ర్యాలీ సాగే 18 కిలోమీటర్ల పొడవునా భారీగా బలగాలను మోహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







