విధ్వంసం సృష్టించిన హరికేన్ ఫ్లోరెన్స్, 5 మంది మృతి
- September 15, 2018
అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన హరికేన్ ఫ్లోరెన్స్ నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ర్టాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోస్తా తీరం వెంబడి గాలులు వేగంగా వీస్తుండటంతో భారీ వృక్షాలు, టవర్లు నేలకొరిగాయి. శుక్రవారం సాయంత్రం తీరాన్ని తాకగా.. కొన్ని క్షణాల్లోనే విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పలు ఘటనల్లో ఐదుగురు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. విల్మింగ్టన్లో ఒక చెట్టు ఇంటిపై కూలడంతో అందులో నివసిస్తున్న తల్లి, బిడ్డ మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో గాయపడిన పాప తండ్రిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరో మహిళ గుండెపోటుతో చనిపోయింది. వైద్య సిబ్బంది ఆమె దగ్గరకు చేరుకొని చికిత్స అందించేందుకు ప్రయత్నించగా.. శిథిలాలు రోడ్డుకు అడ్డంగా పడటంతో దారి మధ్యలోనే చిక్కుకున్నారు. మరికొద్ది రోజుల్లో చాలా ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చాలా చోట్ల సురక్షిత మంచి నీరు, నిత్యవసరాల కోసం ప్రజలు బారులు తీరారు.
అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను వల్ల భారీగా ఫ్రాణనష్టం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శనివారం వరకు తీర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. హరికేన్ ప్రభావం చూపే నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ర్టాల్లో అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







