కాన్సులేట్‌ వద్ద యోగా, మెడిటేషన్‌ సెషన్స్‌

- September 23, 2018 , by Maagulf
కాన్సులేట్‌ వద్ద యోగా, మెడిటేషన్‌ సెషన్స్‌

దుబాయ్‌:దుబాయ్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి శనివారం యోగా, మెడిటేషన్‌ సెషన్స్‌ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 22 సెప్టెంబర్‌ నుంచి ఈ సెషన్స్‌ ప్రారంభమవుతున్నాయి. కాన్సులేట్‌ వద్ద ముందస్తు రిజిస్ట్రేషన్‌ ద్వారా ఈ సెషన్స్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఔత్సాహికులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతోపాటు, యోగా మ్యాట్స్‌ని తమతోనే తెచ్చుకోవాల్సి వుంటుంది. యోగా మరియు మెడిటేషన్‌ సెషన్స్‌ ఉదయం 10.30 నిమిషాల నుంచి 11.30 నిమిషాల వరకు జరుగుతుంది. ఐడీ ప్రూఫ్‌ (ఎమిరేట్స్‌ ఐడీ లేదా పాస్‌పోర్ట్‌) వుంటేనే, కాన్సులేట్‌లోకి ప్రవేశం లభిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com