ముంబై చేరుకున్న వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం
- September 27, 2018ముంబై: ఇండియాలో నెల రోజుల పర్యటన కోసం వెస్టిండీస్ టీమ్ వచ్చేసింది. ఆ టీమ్ ప్లేయర్స్కు భారత సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. హోటల్లోకి అడుగుపెట్టక ముందే డప్పులతో వాళ్లకు వెల్కమ్ చెప్పారు. ఇక లోనికి వెళ్లగానే హోటల్ సిబ్బంది వాళ్లకు బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, మెడలో హారాలు వేశారు. టీమ్ ఇండియాలో అడుగుపెట్టిన వీడియోలను ఆ టీమ్ బోర్డు తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అక్టోబర్ 4 నుంచి మొదలయ్యే తొలి టెస్ట్తో విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో ఇండియా, వెస్టిండీస్ తలపడనున్నాయి. వెస్టిండీస్ 1948 నుంచి ఇప్పటివరకు ఇండియాలో 94 టెస్టులు ఆడింది. అందులో 30 గెలవగా, 20 మ్యాచుల్లో ఓడింది. మరో 46 డ్రాగా ముగిశాయి.
వెస్టిండీస్ టెస్ట్ టీమ్:
జేసన్ హోల్డర్ (కెప్టెన్), సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, క్రెయిగ్ బ్రాత్వెయిట్, రోస్టన్ చేజ్, షేన్ డౌరిచ్, షానన్ గాబ్రియెల్, జామర్ హామిల్టన్, షిమ్రోన్ హెట్మెయర్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, కీమో పాల్, కీరన్ పావెల్, కీమార్ రోచ్, జోమెల్ వారికాన్.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు