స్మార్ట్ ఫోన్తో ప్రైవసీని దెబ్బతీస్తే 500,000 దిర్హామ్ల జరీమానా
- October 02, 2018
యూఏఈలో తల్లిదండ్రులు, తమ పిల్లల ప్రైవసీ, భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. పబ్లిక్ ఏరియాల్లో తమ పిల్లల్ని తమ అనుమతి లేకుండా స్మార్ట్ ఫోన్లలో ఫొటోలు తీయడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా చేసేవారికి 150,000 దిర్హామ్ల నుంచి 500,000 దిర్హామ్ల వరకు జరీమానా విధించే అవకాశం వుంది. అదే సమయంలో ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష కూడా విధించవచ్చని చట్టాలు చెబుతున్నాయి. అనుమతి లేకుండా వేరే వ్యక్తుల ఫొటోలు తీయడం, వీడియోలో చిత్రీకరించడం, ఫోన్ కాల్స్ని రికార్డ్ చేయడం నేరమని చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది. ఫెడరల్ చట్టం 5/2012 ఈ మేరకు ప్రైవసీ విషయంలో స్పష్టతనిస్తోంది. గత ఆరు నెలల్లోనే అబుదాబీ పోలీసులు ఈ చట్టం కింద 71 మంది రెసిడెంట్స్కి జరీమానా విధించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







