స్మార్ట్‌ ఫోన్‌తో ప్రైవసీని దెబ్బతీస్తే 500,000 దిర్హామ్‌ల జరీమానా

- October 02, 2018 , by Maagulf
స్మార్ట్‌ ఫోన్‌తో ప్రైవసీని దెబ్బతీస్తే 500,000 దిర్హామ్‌ల జరీమానా

యూఏఈలో తల్లిదండ్రులు, తమ పిల్లల ప్రైవసీ, భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. పబ్లిక్‌ ఏరియాల్లో తమ పిల్లల్ని తమ అనుమతి లేకుండా స్మార్ట్‌ ఫోన్లలో ఫొటోలు తీయడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా చేసేవారికి 150,000 దిర్హామ్‌ల నుంచి 500,000 దిర్హామ్‌ల వరకు జరీమానా విధించే అవకాశం వుంది. అదే సమయంలో ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష కూడా విధించవచ్చని చట్టాలు చెబుతున్నాయి. అనుమతి లేకుండా వేరే వ్యక్తుల ఫొటోలు తీయడం, వీడియోలో చిత్రీకరించడం, ఫోన్‌ కాల్స్‌ని రికార్డ్‌ చేయడం నేరమని చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది. ఫెడరల్‌ చట్టం 5/2012 ఈ మేరకు ప్రైవసీ విషయంలో స్పష్టతనిస్తోంది. గత ఆరు నెలల్లోనే అబుదాబీ పోలీసులు ఈ చట్టం కింద 71 మంది రెసిడెంట్స్‌కి జరీమానా విధించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com