స్మార్ట్ ఫోన్తో ప్రైవసీని దెబ్బతీస్తే 500,000 దిర్హామ్ల జరీమానా
- October 02, 2018
యూఏఈలో తల్లిదండ్రులు, తమ పిల్లల ప్రైవసీ, భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. పబ్లిక్ ఏరియాల్లో తమ పిల్లల్ని తమ అనుమతి లేకుండా స్మార్ట్ ఫోన్లలో ఫొటోలు తీయడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా చేసేవారికి 150,000 దిర్హామ్ల నుంచి 500,000 దిర్హామ్ల వరకు జరీమానా విధించే అవకాశం వుంది. అదే సమయంలో ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష కూడా విధించవచ్చని చట్టాలు చెబుతున్నాయి. అనుమతి లేకుండా వేరే వ్యక్తుల ఫొటోలు తీయడం, వీడియోలో చిత్రీకరించడం, ఫోన్ కాల్స్ని రికార్డ్ చేయడం నేరమని చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది. ఫెడరల్ చట్టం 5/2012 ఈ మేరకు ప్రైవసీ విషయంలో స్పష్టతనిస్తోంది. గత ఆరు నెలల్లోనే అబుదాబీ పోలీసులు ఈ చట్టం కింద 71 మంది రెసిడెంట్స్కి జరీమానా విధించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







