480 అక్రమ వలసదారుల అరెస్ట్
- October 15, 2018
మస్కట్: లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను 480 మంది అక్రమ వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. అలాగే, ఇదే కేసులో మరో 489 మందిని డిపోర్ట్ చేయడం జరిగింది. వారం రోజుల్లో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జాయింట్ ఆపరేషన్స్ ద్వారా, ఉల్లంఘనలకు పాల్పడిన వలసదారుల వీక్లీ రిపోర్ట్ ఈ గణాంకాల్ని వెల్లడించింది. అక్టోబర్ 7 నుంచి 18 మధ్య ఈ అరెస్టులు, డిపోర్టేషన్ జరిగాయి. క్యాపిటల్ అయిన మస్కట్లో అత్యధికంగా 118 అరెస్టులు జరగగా, దఖ్లియా గవర్నరేట్లో 116 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్టయినవారికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్లోని సంబంధిత అధికార వర్గాలు, తదుపరి చర్యలను చేపట్టనున్నాయి.
తాజా వార్తలు
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!







