480 అక్రమ వలసదారుల అరెస్ట్
- October 15, 2018
మస్కట్: లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను 480 మంది అక్రమ వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. అలాగే, ఇదే కేసులో మరో 489 మందిని డిపోర్ట్ చేయడం జరిగింది. వారం రోజుల్లో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జాయింట్ ఆపరేషన్స్ ద్వారా, ఉల్లంఘనలకు పాల్పడిన వలసదారుల వీక్లీ రిపోర్ట్ ఈ గణాంకాల్ని వెల్లడించింది. అక్టోబర్ 7 నుంచి 18 మధ్య ఈ అరెస్టులు, డిపోర్టేషన్ జరిగాయి. క్యాపిటల్ అయిన మస్కట్లో అత్యధికంగా 118 అరెస్టులు జరగగా, దఖ్లియా గవర్నరేట్లో 116 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్టయినవారికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్లోని సంబంధిత అధికార వర్గాలు, తదుపరి చర్యలను చేపట్టనున్నాయి.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







