త్వరలో నింగిలో చైనా మూన్ దర్శనమిస్తుందిట!
- October 20, 2018ఆకాశంలో మరో అద్భుతం చేసేందుకు చైనా రంగం సిద్ధం చేస్తోంది. సొంతంగా కృత్రిమ చందమామను సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది 2020 కల్లా పూర్తి చేయాలనే ధృడ నిశ్చయంతో చైనా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈ కృత్రిమ చంద్రుడిని ప్రవేశ పెట్టడం ద్వారా వీధి లైట్లకు చెక్ పెట్టి తద్వారా విద్యుత్కు అయ్యే ఖర్చును ఆదా చేయాలని భావిస్తోంది డ్రాగన్ కంట్రీ.
చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్లోని చెంగ్డూ నగరంలో ఈ కృత్రిమ చంద్రులను తయారు చేస్తున్నారు. ఇది సహజ చంద్రుడు ఎంత వెలుగైతే ఇస్తాడో అంతకంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఈ కృత్రిమ చంద్రుడు కాంతిని ఇస్తాడని అధికారులు వెల్లడించారు. మానవుడు తయారు చేసిన తొలి చంద్రుడిని సిచువాన్లోని క్సిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి పంపనున్నారు. ఆ తర్వాత 2022 నాటికి మరో మూడు కృత్రిమ చంద్రులను ఆకాశంలోకి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది చైనా.
మొదటి చంద్రడు కేవలం ప్రయోగం కోసమేనని చెప్పిన శాస్త్రవేత్తలు ఇది విజయవంతం అయితే మరో మూడు చంద్రులను నింగిలోకి పంపనున్నట్లు వెల్లడించారు. ఈ కృత్రిమ చంద్రుడిని కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన తర్వాత సూర్యకాంతి దీనిపై పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక రాత్రి వేళల్లో ఈ చంద్రుడి నుంచి విడుదలయ్యే కాంతితో స్ట్రీట్ లైట్లతో పని ఉండదని చెప్పారు. ఇలా ఊటా 170 మిలియన్ డాలర్లు మేరా విద్యుత్ ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఈ కృత్రిమ చంద్రుడు 50 చదరపు కిలోమీటర్ల మేరా కాంతిని వెదజల్లుతుందని చెప్పారు. అంతేకాదు ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కరెంట్ లేని సమయంలో సహాయక చర్యలు ముందుకు సాగేందుకు ఈ కృత్రిమ చంద్రుడునుంచి విడుదలయ్యే కాంతి ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు