మూడింటినీ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది..రాహుల్
- October 20, 2018
తెలంగాణలో రాహుల్ సమరభేరి మోగించారు. మొదట బైంసా, తరువాత కామారెడ్డి సభలతో కాంగ్రెస్ కేడర్లో జోష్ నింపారు. ముఖ్యంగా కామారెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. కేసీఆర్, మోడీ పాలనపై నిప్పులు చెరిగారు. ఇద్దరూ అవినీతిలో పోటీ పడుతున్నారని మండిపడ్డారు.
నీళ్లు, నిధులు, నియామకాలపై నడిచిన ఉద్యమంతోనే తెలంగాణ ఏర్పాటైందని రాహుల్ అభిప్రాయపడ్డారు. కానీ ఆ మూడింటినీ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. దాదాపు ఐదేళ్ల పాలనలో కేసీఆర్ అవినీతికి పాల్పడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మంటగలిపారని రాహుల్ మండిపడ్డారు.
ప్రాజెక్టుల రీ డిజైన్లో తీవ్ర అనివీతి జరిగిందని రాహుల్ విమర్శించారు. అంబేద్కర్ ప్రాణిహిత పేరు మార్చి ఆయనను అవమానించారన్నారు. కేవలం ప్రాజెక్టుల పేరు మార్చి.. కోట్లు కొల్లగొట్టారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో రైతులది కీలక పాత్ర అని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం కోసం పోరాటం చేసిన రైతులకు కేసీఆర్ బేడీలు వేయించారని రాహుల్ మండిపడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







