అష్టకష్టాలు పడుతున్న యెమెన్ నిర్వాసితులు.. సాయం కోసం ఎదురుచూపులు
- October 22, 2018
అడెన్ : యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమెన్కు మానవతా సాయం అందక పోవడం తో అక్కడ దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా నిర్వా సితులైన వేలాదిమంది యెమెన్ ప్రజలు శీతా కాలంలో ఆరుబయట ఎముకలు కొరికే చలిని తట్టుకుని జీవనం సాగించాల్సి వస్తుంది.. అమెరికా అండదండలతో సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి యమెన్పై జరుపుతున్న దాడుల్లో దక్షిణ ఓడరేవు పట్టణమైన అడెన్ శివార్లలో పెద్ద సంఖ్యలో జనం నిర్వాసితులయ్యారు. వీరు ఎర్ర సముద్రం తీరప్రాంత పట్టణమైన హొడైడాకు వలస వచ్చారు. ఇక్కడ నిత్యావసరాలైన నీరు, విద్యుత్ వంటివి లేకపోవడంతో ఏడారి ప్రాంతంలో జీవించడానికి వారు అష్టకష్టాలు పడుతున్నారు. తమను తక్షణమే ఆదుకోవాలని వారు అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నారు. అడెన్ శివార్లలో నిర్వాసితులు గుడిసెల్లో వుంటున్నారు. తుపానులు, అత్యంత శీతల పరిస్థితులతో ఇప్పటికే తాము ఇబ్బందులు పడుతున్నామని, శీతాకాలం పూర్తి స్థాయిలో వస్తే తమ కష్టాలు మరింత పెరుగుతాయని అడీబ్ ఒమర్ అనే నిర్వాసితుడు పేర్కొన్నారు. ఎడారి ప్రాంతంలో అత్యంత శీతలమైన రాత్రుళ్ళు భరించడం కష్టమని అన్నారు. ఇప్పటికే సరైన ఆహారం లేక పిల్లలు, వృద్ధులు బాధ పడుతున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







