క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్

- December 20, 2015 , by Maagulf
క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్

నిజాం కాలేజీ మైదానంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి రాష్ట్ర ప్రజలకు, క్రిస్టియన్ సోదర,సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చిన్నారులకు గిప్ట్‌లు ఇచ్చారు. నిజాం కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ తోపాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి,ఎంపీ కేకేశవరావు, జితేందర్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు పాల్గొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com