యూఏఈ తొలి శాటిలైట్ నింగిలోకి..!
- October 28, 2018
యూఏఈ:చారిత్రక ఘట్టానికి సర్వం సిద్ధమయ్యింది. జపాన్లోని తనెగాషిమా దీవి నుంచి యూఏఈ తొలి శాటిలైట్ 'ఖలీఫా శాట్'ని నింగిలోకి పంపుతున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని అందరూ వీక్షించేందుకోసం లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. యూఏఈ టైమింగ్ ఉదయం 8 గంటల నుంచి ఇది ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించబోతున్నారు. ఖలీఫా శాట్ని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఎర్త్ అబ్జర్వింగ్ శాటిలైట్గా అభివర్ణిస్తున్న సంగతి తెల్సిందే. మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (ఎంబిఆర్ఎస్సి) ఈ లైవ్ స్ట్రీమింగ్కి ఏర్పాట్లు చేసింది. ఖలీపా శాటిలైట్, హై క్వాలిటీ ఇమేజెస్ని అందించనుంది. సుమారు 70 మంది శాస్త్రవేత్తలు ఈ శాటిలైట్ తయారీలో కీలక భూమిక పోషించారు. వీరిలో 10 మంది జపాన్కి వెళ్ళి అక్కడినుంచి శాటిలైట్ లాంచ్ని పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







