దుబాయ్ గ్లోబల్ విలేజ్ న్యూ సీజన్ రేపే ప్రారంభం
- October 28, 2018
దుబాయ్:గ్లోబల్ విలేజ్లో సరికొత్త సీజన్ రేపటినుంచి ప్రారంభం కాబోతోంది. 23వ సీజన్లో అనేక ప్రత్యేకతలున్నాయి. అడ్వెంచర్స్, కుటుంబ సమేతంగా ఎంటర్టైన్మెంట్ వంటివి గ్లోబల్ విలేజ్లో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు గ్లోబల్ విలేజ్ సీఈఓ బదర్ అన్వాహి పేర్కొన్నారు. ఎక్స్ప్లోర్, ఎక్స్పీరియన్స్, ఎంజాయ్.. అనేలా 159 రోజులపాటు ఈ సీజన్ గ్రాండ్గా జరగనునందని చెప్పారాయన. ఈ ఏడాది 27 పెవిలియన్లు, 78 దేశాల ప్రాతినిథ్యంతో గ్లోబల్ విలేజ్ సందర్శకుల్ని అలరించనుంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఇండియా, జోర్డాన్, పాకిస్తాన్, యూరోప్, అమెరికాస్, బోస్నియా మరియు బల్కాన్స్, థాయిలాండ్, బహ్రెయిన్, లెబనాన్, పాలస్తీన్, ఆఫ్గనిస్తాన్, సిరియా, రష్యా, జపాన్, ఫార్ ఈస్ట్, చైనా, ఆఫ్రికా, ఈజిప్ట్, మొరాకో, టర్కీ, ఇరాన్, యెమెన్, కువైట్ తదితర దేశాలు గ్లోబల్ విలేజ్ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. ఆయా దేశాల పెవిలియన్లు, సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించనున్నాయి. వ్యాట్ తకలిపి ఎంట్రీ టిక్కెట్ 15 దిర్హామ్లు. 3 ఏళ్ళలోపు పిల్లలు, పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ (ఒక సహాయకుడితోపాటు) అలాగే 65 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్కి ప్రవేశం ఉచితం. 20,000కి పైగా కల్చరల్ మరియు ఎంటర్టైన్మెంట్ షోస్, 3,500కి పైగా రిటెయిల్ ఔట్లెట్స్, 12 రిటెయిల్ షాప్స్తో గ్లోబల్ విలేజ్ ఆకర్షణీయంగా మారనుంది.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







