కొత్త చట్టం తెచ్చిన ఖతార్, వలస కార్మికులకు స్వేచ్ఛ.!
- October 28, 2018
ఖతార్: ఏండ్ల తరబడి వలస కార్మికులు ఎదురుచూస్తున్న రిటర్న్ వీసా నిబంధనల్లో ఖతార్ భారీ మార్పులు చేసింది. ఇకపై ఆ దేశంలో పనిచేస్తున్న కార్మికులు తమ స్వదేశానికి వెళ్లడానికి యజమాని అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా కొత్త చట్టాన్ని తెచ్చింది. ఇప్పటి వరకు ఖతార్లో పనిచేస్తున్న కార్మికులు తమ స్వదేశానికి వెళ్లాలంటే యజమాని అనుమతి తీసుకోవాలి. ఆ యజమాని అనుమతించక చాలా మంది కార్మికులు అక్కడే ఉండిపోవాల్సి వస్తున్నది. ఈ నిబంధనను తొలిగించాలని ఏండ్ల తరబడి చేస్తున్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకున్న ఖతార్ ప్రభుత్వం ఎట్టకేలకు నిబంధనను తొలిగించింది. ఓ కంపెనీలోని కార్మికుల్లో కీలక స్థానాల్లో ఉన్న 5శాతం మంది మాత్రం యజమాని అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్న నిబంధనను విధించింది. ఒకవేళ కార్మికుడు స్వదేశానికి వెళ్లకుండా కంపెనీ యజమాని అడ్డుపడితే ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదుపై మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఖతార్ పేర్కొంది. ఖతార్లో దాదాపు 20 లక్షల మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి అందులోనూ భారతీయులే అధికం.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









