కొత్త చట్టం తెచ్చిన ఖతార్, వలస కార్మికులకు స్వేచ్ఛ.!
- October 28, 2018
ఖతార్: ఏండ్ల తరబడి వలస కార్మికులు ఎదురుచూస్తున్న రిటర్న్ వీసా నిబంధనల్లో ఖతార్ భారీ మార్పులు చేసింది. ఇకపై ఆ దేశంలో పనిచేస్తున్న కార్మికులు తమ స్వదేశానికి వెళ్లడానికి యజమాని అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా కొత్త చట్టాన్ని తెచ్చింది. ఇప్పటి వరకు ఖతార్లో పనిచేస్తున్న కార్మికులు తమ స్వదేశానికి వెళ్లాలంటే యజమాని అనుమతి తీసుకోవాలి. ఆ యజమాని అనుమతించక చాలా మంది కార్మికులు అక్కడే ఉండిపోవాల్సి వస్తున్నది. ఈ నిబంధనను తొలిగించాలని ఏండ్ల తరబడి చేస్తున్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకున్న ఖతార్ ప్రభుత్వం ఎట్టకేలకు నిబంధనను తొలిగించింది. ఓ కంపెనీలోని కార్మికుల్లో కీలక స్థానాల్లో ఉన్న 5శాతం మంది మాత్రం యజమాని అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్న నిబంధనను విధించింది. ఒకవేళ కార్మికుడు స్వదేశానికి వెళ్లకుండా కంపెనీ యజమాని అడ్డుపడితే ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదుపై మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఖతార్ పేర్కొంది. ఖతార్లో దాదాపు 20 లక్షల మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి అందులోనూ భారతీయులే అధికం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







