ఒమాన్ లో సరైన ఆహార భద్రతా ప్రమాణాలను పెంపొందించాలని పిలుపు
- December 21, 2015
ఒమాన్ లోని బుషేర్ ప్రాంతంలో సగం అల్పాహారశాలలో కనీసం ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని తేలింది.
పార్లమెంటేరియన్ సభ్యులు , ఆహార భద్రతా నిపుణుల బృందం స్థానిక మునిసిపల్ అధికారులకు ఇటీవల ఇచ్చిన సూచన
మేరకు పలు అల్పాహారశాలలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో ఎన్నో ఆశ్యరకరమైన సంగతులు వెలుగులోనికి
వచ్చాయి. ఏ మాత్రం ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా, వినియోగదారుల ఆరోగ్యాన్ని పాడు చేసే పరిస్తితులే అక్కడ
అధికంగా ఉంటున్నాయి .ఇందుకు సంబంధిత రెస్టరెంట్ యాజమాన్యాలు భారీ జరిమానాలను వడ్డించడం లో వెనుకాడాల్సిన
పని లేదని ఆ బృందం మార్గ నిర్దేశం చేసింది. అల్పాహారశాలలకు వచ్చిన వినియోగదారుడు నేరుగా వంటశాల లోనికి ప్రవెశించ
లేడు కనుక, మునిసిపల్ అధికారులే చొరవ తీసుకొని వంటలు చేసే చోటుకి వెళ్ళి ఆహార పరీక్షలు జరపాలని అన్నారు. తయారీ
విధానాన్ని శ్రద్దగా గమనించాలని కోరారు. ముస్కేట్ మునిసిపల్ పరిధిలో స్థానిక అధికార్లు 125 రెస్టారెంట్లపై మెరుపు దాడి
చేశారు. ఇందులో 53 అల్పాహారశాలలో కనీసం ఆహార భద్రతా నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని గుర్తించారు. ఆహార
పదార్ధాల నుండి దుర్వాసన వెదజల్లడం , ఈగలు ముసురుతున్న మరో రెండు రెస్టారెంట్లను గుర్తించి వాటి అనుమతిని రద్దు చేశారు . పరిశుభ్రమైన ఆహారం లేని కారణం , ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో వాటిని నిషేధించినట్లు అధికార్లు వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







