సైక్లిస్ట్పై దాడి, దోపిడీ
- November 05, 2018
షార్జా క్రిమినల్ కోర్టులో ఆసియాకి చెందిన ఓ వ్యక్తిపై దాడి, దొంగతనం అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు, ఓ సైక్లిస్ట్పై దాడి చేసి 10,000 దిర్హామ్లను దోచుకున్నట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. షార్జాలోని సజా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులతో కలిసి నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం 7 గంటల సమయంలో సజా ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో తాను సైకిల్పై వెళుతుండగా, ముగ్గురు వ్యక్తులు తనను ఆపి, దారి చూపించమని అడిగారనీ, అంతలోనే వారు తనపై దాడికి దిగి, దోచుకున్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కత్తితో బెదిరించి దాడి చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే న్యాయస్థానంలో నిందితులు మాత్రం తామెలాంటి దాడికి పాల్పడలేదని అంటున్నారు. కేసు విచారణ నవంబర్ 28వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







