సైక్లిస్ట్పై దాడి, దోపిడీ
- November 05, 2018షార్జా క్రిమినల్ కోర్టులో ఆసియాకి చెందిన ఓ వ్యక్తిపై దాడి, దొంగతనం అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు, ఓ సైక్లిస్ట్పై దాడి చేసి 10,000 దిర్హామ్లను దోచుకున్నట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. షార్జాలోని సజా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులతో కలిసి నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం 7 గంటల సమయంలో సజా ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో తాను సైకిల్పై వెళుతుండగా, ముగ్గురు వ్యక్తులు తనను ఆపి, దారి చూపించమని అడిగారనీ, అంతలోనే వారు తనపై దాడికి దిగి, దోచుకున్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కత్తితో బెదిరించి దాడి చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే న్యాయస్థానంలో నిందితులు మాత్రం తామెలాంటి దాడికి పాల్పడలేదని అంటున్నారు. కేసు విచారణ నవంబర్ 28వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..