హత్య కేసులో నిందితురాలి వాదన ఇదే!
- November 23, 2018
అల్ అయిన్:అల్ అయిన్లో ఓ మహిళ, తన మాజీ లవర్ని హత్య చేసి, అతని శరీర భాగాల్ని ముక్కలుగా కోసి, వాటితో బిర్యానీ వండి.. తన ఇంటి పక్కనే ఓ భవన నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులకు వడ్డించిందంటూ ఓ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. అయితే, పోలీసులు 'వండి వడ్డించడం' అనే అంశానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవనీ, దీనిపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని, ఇలాంటి వార్తల్ని ప్రసారం చేయొద్దని అభ్యర్థిస్తున్నారు. మరో వైపున ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితురాలు, విచారణ సందర్భంగా తొలుత తన మాజీ బాయ్ఫ్రెండ్ తన మీద దాడికి దిగాడని నిందితురాలి తరఫు లాయర్ పేర్కొన్నారు. బాయ్ఫ్రెండ్ దాడి కారణంగా, ఆందోళన చెందిన ఆ మహిళ తనకు అందుబాటులో వున్న కత్తితో, బాయ్ఫ్రెండ్పై ఎదురుదాడి చేసిందనీ, దాంతో కుప్పకూలిన ఆ వ్యక్తిని చూసి షాక్కి గురైన ఆ మహిళ ఆ తర్వాత తేరుకుని, మృతదేహాన్ని ముక్కలుగా కోసిందని విచారణలో తేలింది. బాయ్ఫ్రెండ్తో జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









