వీకెండ్ కాన్సర్ట్ వద్ద అభిమానుల ఆందోళన
- November 24, 2018
అబుధాబి:వీకెండ్ ఎఫ్1 వన్ కాన్సెర్ట్ అభిమానులు డు ఎరీనా వద్ద ఆందోళన చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిని తోసేసి, గేట్లను ధ్వంసం చేశారు. రాత్రి 9.30 నిమిషాల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. గేట్లను ఓపెన్ చేయాల్సిందిగా అభ్యర్థించిన ఆందోళనకారులు, చివరికి సంయమనం కోల్పోయారు. టిక్కెట్ల కొనుక్కున్న తమను సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించారని దుబాయ్ రెసిడెంట్ అయిన అలీసా ఆవేదన వ్యక్తం చేశారు. ఐరిష్ వలసదారుడు మాట్లాడుతూ, తన భార్య, మరికొందరు స్నేహితులతో కలిసి టిక్కెట్లు కొన్నప్పటికీ తమను అనుమతించలేదని ఆరోపించారు. యూకేకి చెందిన టూరిస్ట్ ఒకరు 400 పౌండ్లు వెచ్చించి టిక్కెట్ కొనుగోలు చేశాననీ, అయినా తమకు అనుమతివ్వలేదనీ, ఇది చాలా బాధకరమని అన్నారు. అయితే డు అరెనీ గ్రౌండ్ కంప్లీట్గా ప్యాక్డ్ అయిపోవడంతోనే నిర్వాహకుల ఆదేశంతో మిగిలినవారిని అనుమతించలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. డు ఎరీనా కెపాసిటీ 35,000 కాగా, అంతకు మించి టిక్కెట్లు విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









