పంజాబ్ మంత్రి సిద్ధూకి ఆహ్వానం పంపిన ఇమ్రాన్
- November 24, 2018
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ నుంచి మరోసారి పంజాబ్ మంత్రి నవజ్యోత్సింగ్ సిద్ధూకి ఆహ్వానం అందింది. ఈనెల 28న భారత్-పాకిస్థాన్ బోర్డర్ కు చేరువగా నిర్మించబోతున్న కర్తార్పుర్ సాహిబ్ కారిడార్ శంకుస్థాపనకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. రెండు దేశాల్లోని జరగబోతున్న కారిడార్ నిర్మాణానికి ఈ నెల 26న భారత్వైపు పనులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శంకుస్థాపన చేస్తున్నారు. పాక్వైపు 28న ఇమ్రాన్ఖాన్ పునాదిరాయి వేయనున్నారు. రెండు దేశాల్లో పనులు పూర్తయితే వచ్చే ఏడాది నవంబరులో గురునానక్ 550వ జయంతి నాటికి భారతదేశ సిక్కులు- గురుద్వారా నానక్ సాహిబ్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది ఆగస్టులో ఇమ్రాన్ఖాన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధూ హాజరైనప్పుడు ఈ అంశాన్ని గుర్తుచేశారు.దాంతో కర్తార్ పుర్ కారిడార్ కు మార్గం సుగమమైంది.
తాజా వార్తలు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ









