పంజాబ్ మంత్రి సిద్ధూకి ఆహ్వానం పంపిన ఇమ్రాన్
- November 24, 2018
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ నుంచి మరోసారి పంజాబ్ మంత్రి నవజ్యోత్సింగ్ సిద్ధూకి ఆహ్వానం అందింది. ఈనెల 28న భారత్-పాకిస్థాన్ బోర్డర్ కు చేరువగా నిర్మించబోతున్న కర్తార్పుర్ సాహిబ్ కారిడార్ శంకుస్థాపనకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. రెండు దేశాల్లోని జరగబోతున్న కారిడార్ నిర్మాణానికి ఈ నెల 26న భారత్వైపు పనులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శంకుస్థాపన చేస్తున్నారు. పాక్వైపు 28న ఇమ్రాన్ఖాన్ పునాదిరాయి వేయనున్నారు. రెండు దేశాల్లో పనులు పూర్తయితే వచ్చే ఏడాది నవంబరులో గురునానక్ 550వ జయంతి నాటికి భారతదేశ సిక్కులు- గురుద్వారా నానక్ సాహిబ్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది ఆగస్టులో ఇమ్రాన్ఖాన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధూ హాజరైనప్పుడు ఈ అంశాన్ని గుర్తుచేశారు.దాంతో కర్తార్ పుర్ కారిడార్ కు మార్గం సుగమమైంది.
తాజా వార్తలు
- దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!







