భారత ప్రధాని, సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ
- November 30, 2018
జెడ్డా: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అర్జెంటీనాలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సెక్యూరిటీ, ఎనర్జీ, ఇన్వెస్టిమెంట్స్ వంటి విభాగాలకు సంబంధించి ఇరువురి మధ్యా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. బ్యూనస్ ఎయిర్స్లో జి20 సమ్మిట్ కోసం ఈ ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. సౌదీ ఆయిల్ జెయింట్ అరామ్కో, భారతదేశంలో ఆయిల్ రిఫైనింగ్, ఆయిల్ స్టోరేజ్ రంగాల్లో పెట్టుబడుల అంశం, అలాగే భారతదేశపు ఆయిల్ మరియు పెట్రోలియం ప్రోడక్ట్స్ అవసరాల గురించి ఇద్దరూ చర్చించుకున్నారు. అర్జెంటీనాలోని క్రౌన్ ప్రిన్స్ రెసిడెన్స్లో ఈ సమావేశం జరిగింది. సోలార్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఇరువురూ అంగీకారం తెలిపినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్లోకి సౌదీ అరేబియాని ప్రధాని ఆహ్వానించగా, ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నట్లు సౌదీ క్రౌన్ ప్రిన్స్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







