భారత ప్రధాని, సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ
- November 30, 2018
జెడ్డా: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అర్జెంటీనాలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సెక్యూరిటీ, ఎనర్జీ, ఇన్వెస్టిమెంట్స్ వంటి విభాగాలకు సంబంధించి ఇరువురి మధ్యా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. బ్యూనస్ ఎయిర్స్లో జి20 సమ్మిట్ కోసం ఈ ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. సౌదీ ఆయిల్ జెయింట్ అరామ్కో, భారతదేశంలో ఆయిల్ రిఫైనింగ్, ఆయిల్ స్టోరేజ్ రంగాల్లో పెట్టుబడుల అంశం, అలాగే భారతదేశపు ఆయిల్ మరియు పెట్రోలియం ప్రోడక్ట్స్ అవసరాల గురించి ఇద్దరూ చర్చించుకున్నారు. అర్జెంటీనాలోని క్రౌన్ ప్రిన్స్ రెసిడెన్స్లో ఈ సమావేశం జరిగింది. సోలార్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఇరువురూ అంగీకారం తెలిపినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్లోకి సౌదీ అరేబియాని ప్రధాని ఆహ్వానించగా, ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నట్లు సౌదీ క్రౌన్ ప్రిన్స్ తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









