ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఫ్రీ వైఫై
- November 30, 2018
చైనా:జేబులో డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ చేతిలో ఫోన్ లేకపోతే ముఖ్యంగా అందులో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఎంత కష్టం. అంతగా కనెక్ట్ అయిపోయారు సామాన్యులు సైతం. ఊర్లో సరైన సదుపాయాలు లేకపోయినా ఊరంతటికీ వైఫై వచ్చేస్తుంది. నెలాఖరులో వచ్చే ఫోన్ బిల్లు చూసి బావురుమన్నా అది లేందే క్షణం గడవడం కష్టం.
నెట్ వర్క్ ఛార్జీలు, వైఫైల బిల్లులు కట్టే పనిలేకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఉచిత వైఫై సౌకర్యం ఉంటే.. ఇంక జనం నిద్రా, నీళ్లు మర్చిపోతారేమో. ఓ చైనా కంపెనీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. హాంకాంగ్కు చెందిన లింక్ష్యూర్ నెట్వర్క్ 272 ఉపగ్రహాల్ని రోదసీలోకి పంపి, వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉచిత వైఫై అందిస్తామని చెబుతోంది.
ఇప్పటికే గూగుల్, స్పేస్-ఎక్స్ సంస్థలు.. ఉపగ్రహాల ద్వారా ఉచిత వైఫై ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పుడు లింక్ష్యూర్ వాటికి పోటీకి వస్తోంది. దాదాపు రూ.3వేల కోట్లను ఈ ప్రయోగం కోసం వెచ్చిస్తారట. 2020 లోపు 10 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టి, 2026 కల్లా మొత్తం 272 ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తామని సంస్థ సీఈవో వాంగ్ జింగ్యింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







