ఖతారీల కిడ్నాప్‌ని ఖండించిన జిసిసి

- December 23, 2015 , by Maagulf
ఖతారీల కిడ్నాప్‌ని ఖండించిన జిసిసి

గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ మెంబర్‌ స్టేట్స్‌, ఇరాక్‌లో ఖార్‌ పౌరుల కిడ్నాప్‌ని తీవ్రంగా ఖండించాయి. పిరికిపంద చర్యగా ఈ కిడ్నాప్‌ని అభివర్ణించాయి జిసిసి సభ్య దేశాలు. జిసిసి జనరల్‌ సెక్రెటరీ విడుదల చేసిన ఓ ప్రకటనలో, కిడ్నాప్‌ అయిన ఖతార్‌ పౌరులను క్షేమంగా విడిపించేందుకు ఇరాక్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఖతార్‌కి జిసిసి సభ్యదేశాలు మద్దతుగా నిలుస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఖతార్‌, ఇరాక్‌ మధ్య ఈ సమస్య పరిష్కారం కోసం జిసిసి సభ్య దేశాలు చొరవ చూపేందుకు సిద్ధంగా ఉన్నాయనీ చెప్పారు. ఇరాక్‌ ప్రభుత్వం తక్షణం, ఖతార్‌ పౌరులు క్షేమంగా విడుదల చేసేందుకు ప్రయత్నించాలనీ, మానవ హక్కుల్ని హరించే ఎలాంటి తీవ్రవాద చర్యలనూ ఉపేక్షించరాదని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com