ఖతారీల కిడ్నాప్ని ఖండించిన జిసిసి
- December 23, 2015
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మెంబర్ స్టేట్స్, ఇరాక్లో ఖార్ పౌరుల కిడ్నాప్ని తీవ్రంగా ఖండించాయి. పిరికిపంద చర్యగా ఈ కిడ్నాప్ని అభివర్ణించాయి జిసిసి సభ్య దేశాలు. జిసిసి జనరల్ సెక్రెటరీ విడుదల చేసిన ఓ ప్రకటనలో, కిడ్నాప్ అయిన ఖతార్ పౌరులను క్షేమంగా విడిపించేందుకు ఇరాక్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఖతార్కి జిసిసి సభ్యదేశాలు మద్దతుగా నిలుస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఖతార్, ఇరాక్ మధ్య ఈ సమస్య పరిష్కారం కోసం జిసిసి సభ్య దేశాలు చొరవ చూపేందుకు సిద్ధంగా ఉన్నాయనీ చెప్పారు. ఇరాక్ ప్రభుత్వం తక్షణం, ఖతార్ పౌరులు క్షేమంగా విడుదల చేసేందుకు ప్రయత్నించాలనీ, మానవ హక్కుల్ని హరించే ఎలాంటి తీవ్రవాద చర్యలనూ ఉపేక్షించరాదని కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









