ఖతారీల కిడ్నాప్ని ఖండించిన జిసిసి
- December 23, 2015
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మెంబర్ స్టేట్స్, ఇరాక్లో ఖార్ పౌరుల కిడ్నాప్ని తీవ్రంగా ఖండించాయి. పిరికిపంద చర్యగా ఈ కిడ్నాప్ని అభివర్ణించాయి జిసిసి సభ్య దేశాలు. జిసిసి జనరల్ సెక్రెటరీ విడుదల చేసిన ఓ ప్రకటనలో, కిడ్నాప్ అయిన ఖతార్ పౌరులను క్షేమంగా విడిపించేందుకు ఇరాక్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఖతార్కి జిసిసి సభ్యదేశాలు మద్దతుగా నిలుస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఖతార్, ఇరాక్ మధ్య ఈ సమస్య పరిష్కారం కోసం జిసిసి సభ్య దేశాలు చొరవ చూపేందుకు సిద్ధంగా ఉన్నాయనీ చెప్పారు. ఇరాక్ ప్రభుత్వం తక్షణం, ఖతార్ పౌరులు క్షేమంగా విడుదల చేసేందుకు ప్రయత్నించాలనీ, మానవ హక్కుల్ని హరించే ఎలాంటి తీవ్రవాద చర్యలనూ ఉపేక్షించరాదని కోరారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







