న్యూయార్క్లో బాంబు కలకలం, నిలిచిపోయిన సిఎన్ఎన్ ప్రసారాలు
- December 07, 2018
న్యూయార్క్ : న్యూయార్క్లోని టైమర్ వార్నర్ సెంటర్ బిల్డింగ్లో ఐదు బాంబులను అమర్చినట్లు ఓ ఫోన్కాల్ రావడంతో అక్కడ సమీపంలోని కేబుల్ న్యూస్ నెట్వర్క్(సిఎన్ఎన్) ప్రసార కార్యాలయాల భవనాన్ని పోలీసులు గురువారం రాత్రి ఖాళీ చేయించారు. దీంతో ప్రసారాలకు తీవ్ర అంతరాయం కలిగిందని పోలీసులు తెలిపారు. ఈ బాంబు కలకలంతో సమీపంలోని భవనాలను ఖాళీ చేయించామని, గాలింపు చర్యలు చేపట్టినట్లు న్యూయార్క్ పోలీస్ డిటెక్టివ్ తెలిపారు. బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలను, పాదచారులరు సైతం తనిఖీ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో కాల్ వచ్చిందని, దీంతో న్యూస్ చానల్ ప్రసారాలను నిలిపివేసి, భవనం నుండి ఉద్యోగులను సురక్షితంగా వెలుపలకు పంపించామని తెలిపారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









