న్యూయార్క్లో బాంబు కలకలం, నిలిచిపోయిన సిఎన్ఎన్ ప్రసారాలు
- December 07, 2018
న్యూయార్క్ : న్యూయార్క్లోని టైమర్ వార్నర్ సెంటర్ బిల్డింగ్లో ఐదు బాంబులను అమర్చినట్లు ఓ ఫోన్కాల్ రావడంతో అక్కడ సమీపంలోని కేబుల్ న్యూస్ నెట్వర్క్(సిఎన్ఎన్) ప్రసార కార్యాలయాల భవనాన్ని పోలీసులు గురువారం రాత్రి ఖాళీ చేయించారు. దీంతో ప్రసారాలకు తీవ్ర అంతరాయం కలిగిందని పోలీసులు తెలిపారు. ఈ బాంబు కలకలంతో సమీపంలోని భవనాలను ఖాళీ చేయించామని, గాలింపు చర్యలు చేపట్టినట్లు న్యూయార్క్ పోలీస్ డిటెక్టివ్ తెలిపారు. బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలను, పాదచారులరు సైతం తనిఖీ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో కాల్ వచ్చిందని, దీంతో న్యూస్ చానల్ ప్రసారాలను నిలిపివేసి, భవనం నుండి ఉద్యోగులను సురక్షితంగా వెలుపలకు పంపించామని తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







