న్యూయార్క్లో బాంబు కలకలం, నిలిచిపోయిన సిఎన్ఎన్ ప్రసారాలు
- December 07, 2018న్యూయార్క్ : న్యూయార్క్లోని టైమర్ వార్నర్ సెంటర్ బిల్డింగ్లో ఐదు బాంబులను అమర్చినట్లు ఓ ఫోన్కాల్ రావడంతో అక్కడ సమీపంలోని కేబుల్ న్యూస్ నెట్వర్క్(సిఎన్ఎన్) ప్రసార కార్యాలయాల భవనాన్ని పోలీసులు గురువారం రాత్రి ఖాళీ చేయించారు. దీంతో ప్రసారాలకు తీవ్ర అంతరాయం కలిగిందని పోలీసులు తెలిపారు. ఈ బాంబు కలకలంతో సమీపంలోని భవనాలను ఖాళీ చేయించామని, గాలింపు చర్యలు చేపట్టినట్లు న్యూయార్క్ పోలీస్ డిటెక్టివ్ తెలిపారు. బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలను, పాదచారులరు సైతం తనిఖీ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో కాల్ వచ్చిందని, దీంతో న్యూస్ చానల్ ప్రసారాలను నిలిపివేసి, భవనం నుండి ఉద్యోగులను సురక్షితంగా వెలుపలకు పంపించామని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?