పెళ్లి సందడి మొదలైంది..
- December 13, 2018మరో సెలబ్రిటీ జంట పెళ్లికి వేళైంది. భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ల ఇంట పెళ్లి సందడి మొదలైంది. బంధువులు, శ్రేయోభిలాషుల రాకతో సైనా, కశ్యప్ల ఇళ్లు సందడిగా మారాయి. ఇప్పటికే వివాహ విందు ఆహ్వాన పత్రాల్ని ప్రముఖులందరికి సైనా, కశ్యప్లు అందజేశారు. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
సైనా, కశ్యప్ల పెళ్లి చాలా సాదాసీదాగా జరుగుతుందని బంధువులు చెబుతున్నారు. రేపు రిజిస్టర్ మ్యారేజీ ద్వారా సైనా, కశ్యప్లు ఒక్కటి కానున్నారు. ఇక అదే రోజు దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు ఇరువురు కుటుంబ సభ్యులు.
ఈ నెల 16న వివాహ విందు ఇవ్వనున్నారు. ఈ వివాహ విందుకు క్రీడా, పారిశ్రామిక, సినీ, రాజకీయ రంగ ప్రముఖులను హాజరు కానున్నారు. గత కొన్నేళ్లుగా సైనా, కశ్యప్లు భారత బ్యాడ్మింటన్లో రాణిస్తున్నారు. అసాధారణ విజయాలతో అందరిని ఆకర్షించారు. గత కొంత కాలంగా సైనా, కశ్యప్లు ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరువురు కుటుంబ పెద్దలు కూడా అంగీకరించారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన