పెళ్లి సందడి మొదలైంది..
- December 13, 2018
మరో సెలబ్రిటీ జంట పెళ్లికి వేళైంది. భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ల ఇంట పెళ్లి సందడి మొదలైంది. బంధువులు, శ్రేయోభిలాషుల రాకతో సైనా, కశ్యప్ల ఇళ్లు సందడిగా మారాయి. ఇప్పటికే వివాహ విందు ఆహ్వాన పత్రాల్ని ప్రముఖులందరికి సైనా, కశ్యప్లు అందజేశారు. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
సైనా, కశ్యప్ల పెళ్లి చాలా సాదాసీదాగా జరుగుతుందని బంధువులు చెబుతున్నారు. రేపు రిజిస్టర్ మ్యారేజీ ద్వారా సైనా, కశ్యప్లు ఒక్కటి కానున్నారు. ఇక అదే రోజు దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు ఇరువురు కుటుంబ సభ్యులు.
ఈ నెల 16న వివాహ విందు ఇవ్వనున్నారు. ఈ వివాహ విందుకు క్రీడా, పారిశ్రామిక, సినీ, రాజకీయ రంగ ప్రముఖులను హాజరు కానున్నారు. గత కొన్నేళ్లుగా సైనా, కశ్యప్లు భారత బ్యాడ్మింటన్లో రాణిస్తున్నారు. అసాధారణ విజయాలతో అందరిని ఆకర్షించారు. గత కొంత కాలంగా సైనా, కశ్యప్లు ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరువురు కుటుంబ పెద్దలు కూడా అంగీకరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







