వివాదాస్పదం : గూగుల్లో ఇడియట్ అని సెర్చ్ చేస్తే..
- December 13, 2018
గూగుల్లో ఇడియట్ అని సెర్చ్ చేస్తే ఎవరి ఫోటోలు దర్శనమిస్తాయో తెలుసా? ఎవరివో కాదు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోటోనే. నెటిజన్లు ఇడియట్ అని సెర్చ్ చేస్తే గూగుల్లో ట్రంప్ ఫోటో దర్శనమివ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గత జులై నెల నుంచి ఈ పదం సెర్చ్ చేస్తే అమెరికా అధ్యక్షుడి చిత్రాలే కనిపిస్తున్నాయి.
అయితే.. ట్రంప్ పాలనపై అసంతృప్తితో ఉన్న వ్యతిరేకులు, ఆందోళనకారుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ ఫొటోకు ఇడియట్ అని జతచేసి గూగుల్ ఆల్గరిథమ్కు లింక్ చేయడంతో ట్రంప్ ఫొటోలు కనబడుతున్నాయని టెక్నాలిజీ నిపుణులు అంటున్నారు. ఇదే అమెరికా మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ట్రంప్కు వ్యతిరేకంగా అనేకమంది గూగుల్ ఆల్గరిథమ్కు ట్రంప్ ఫొటోను ఇడియట్ పదంతో లింక్ చేయడం వల్ల ఇలా జరుగుతుందంటున్నారు.
అయితే అమెరికా జ్యూడిషియరీ కమిటీ సమావేశంలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కమిటీ సమావేశానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ హాజరయ్యారు. ఇడియట్ అని సెర్చ్ చేస్తే ట్రంప్ ఫొటోలు ఎందుకు కనిపిస్తున్నాయి? అసలు గూగుల్ సెర్చ్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తోందో చెప్పాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ను ప్రశ్నించారు. గోప్యత, వ్యక్తిగత సమాచార సేకరణ వంటి అంశాల మీద జరిగిన కాంగ్రెస్ సభ్యుల జ్యుడీషియరీ కమిటీ సమావేశంలో ఈ డెమోక్రటిక్ సభ్యురాలు ఈ విషయాన్ని లేవనెత్తారు.
కోట్లాది వెబ్ పేజీలలోని సమాచారం గూగుల్ ఇండెక్స్లో కాపీ చేసి ఉంటుందని… ఎవరైనా ఏదైనా కీ వర్డ్తో గూగుల్లో వెతికినప్పుడు దాదాపు 200కు పైగా పోలికల ఆధారంగా సంబంధిత సమాచారం వస్తాయని సుందర్ పిచాయ్ తెలిపారు. అంతేకానీ తెరవెనుక ఎవరో ఉండి కావాలని చేసేది కాదంటూ వివరణ ఇచ్చారు.
జ్యూడిషియరీ కమిటీ సమావేశానికి హాజరైన పిచాయ్కి…..రాజకీయ పక్షపాతం గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ ఎలా వాడుతోంది? ముఖ్యంగా జీపీఎస్ ద్వారా వినియోగదారుల స్థానాన్ని ఎలా ట్రాక్ చేస్తోంది? అన్నది చెప్పాలని కమిటీ సభ్యులు అడిగారు. అన్నింటికి స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు సుందర్ పిచాయ్.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







