షార్జాలో 3 దిర్హామ్ల వరకు పెరిగిన బస్ ఛార్జీలు
- December 13, 2018షార్జా సిటీలో బస్ ప్రయాణీకులు ఇకపై 1 నుంచి 3 దిర్హామ్ల వరకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త టారిఫ్ ప్రయాణీకులకు కాస్త భారంగా మారింది. సిటీ మరియు ఇంటర్సిటీ బస్ రూట్స్లో ఛార్జీల్ని పెంచింది షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. సిటీ రోడ్స్పై 7 దిర్హామ్లకు బదులుగా 8 దిర్హామ్లు చెల్లించాల్సి వస్తోంది. సాయెర్ కార్డ్స్పై ప్రయాణించేవారు 5.5 దిర్హామ్లకు బదులుగా 6 దిర్హామ్లు చెల్లించాలి. ఇంటర్సిటీ బస్ రూట్స్లో ప్రయాణించేవారికి మరింత అదనపు బాదుడు తప్పడంలేదు. షార్జా నుంచి అబుదాబీ లేదా అల్ అయిన్కి వెళ్ళేవారు 30 దిర్హామ్ల స్థానంలో 33 దిర్హామ్లు చెల్లించాలి. రస్ అల్ ఖైమాకు 25 దిర్హామ్లు గతంలో చెల్లిస్తే, ఇప్పుడు అది 27 దిర్హామ్లకు పెరిగింది. షార్జా నుంచి అజ్మన్కి 1 దిర్హామ్ పెరగగా, ఉమ్ అల్ కువైన్కి 2 దిర్హామ్లు పెరిగింది. ఛార్జీల పెరుగుదల భారంగా మారిందని ప్రయాణీకులుఅ ంటున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన