అంగరంగ వైభవంగా ఈశా-ఆనంద్ల పెళ్లి
- December 13, 2018

దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచిన ఈశా అంబానీ- ఆనంద్ పిరమాల్ల వివాహ వేడుక బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి వేదికయిన ముకేశ్ అంబానీ స్వగృహం 'యాంటిలియా'ను దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన పలు రకాల పూలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ కుబేరుడి సౌధం, ఈ అలంకరణతో మరింత ఆకర్షణీయంగా మారింది. పెళ్లికుమార్తె ఈశాను సోదరులు ఆకాశ్, అనంత్, అన్మోల్ తదితరులు ముత్యాలతో అలంకరించిన ఛాదర్ పట్టి మండపానికి తీసుకువచ్చారు. నృత్య కళాకారులతో బారాత్ బృందం ముందు రాగా.. ఆ వెనకనే రోల్స్ రాయల్ కారులో వరుడు ఆనంద్ పిరమాల్, తన కుటుంబసభ్యులతో కలిసి యాంటిలియాకు చేరుకున్నారు. పెళ్లికుమార్తె సోదరులు అశ్వాలను అధిరోహించి సందడి చేశారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









