అంగరంగ వైభవంగా ఈశా-ఆనంద్ల పెళ్లి
- December 13, 2018

దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచిన ఈశా అంబానీ- ఆనంద్ పిరమాల్ల వివాహ వేడుక బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి వేదికయిన ముకేశ్ అంబానీ స్వగృహం 'యాంటిలియా'ను దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన పలు రకాల పూలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ కుబేరుడి సౌధం, ఈ అలంకరణతో మరింత ఆకర్షణీయంగా మారింది. పెళ్లికుమార్తె ఈశాను సోదరులు ఆకాశ్, అనంత్, అన్మోల్ తదితరులు ముత్యాలతో అలంకరించిన ఛాదర్ పట్టి మండపానికి తీసుకువచ్చారు. నృత్య కళాకారులతో బారాత్ బృందం ముందు రాగా.. ఆ వెనకనే రోల్స్ రాయల్ కారులో వరుడు ఆనంద్ పిరమాల్, తన కుటుంబసభ్యులతో కలిసి యాంటిలియాకు చేరుకున్నారు. పెళ్లికుమార్తె సోదరులు అశ్వాలను అధిరోహించి సందడి చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







