క్యుఎన్సిసిలో భారత సింగర్ ప్రదర్శన
- December 13, 2018
దోహా: భారత మెలోడీ కింగ్ కుమార్ సాను, ఖతార్ రెసిడెంట్స్ని తన పాటలతో అలరించనున్నారు. ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 28న కుమార్ సాను సంగీత విభావరి జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఈవెంట్ని నిర్వహించనున్నారు. 'ఏ కాలి కాలి ఆంకేన్, ఏక్ లడ్కి కో దేఖా, ఆంకో కి గుస్తాకియాన్..' వంటి ఎన్నో అద్భుతమైన పాటలతో కుమార్ సాను, బాలీవుడ్ మెలోడీ కింగ్ అన్పించుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం పద్మ పురస్కారంతో కుమార్ సానుని గౌరవించింది. 24 గంటల్లో అత్యధిక పాటల్ని పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు దక్కించుకున్నారు కుమార్ సాను. కాగా, కుమార్ సాను సంగీత విభావరికి వెళ్ళాలనుకునేవారికి 75 ఖతారీ రియాల్స్ నుంచి 300 ఖతారీ రియాల్స్ ధరల్లో టిక్కెట్లు అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్లో కొత్త అప్డేట్..
- కువైట్లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!
- భారతీయ నావికులను పరామర్శించిన దుబాయ్ భారత కాన్సులేట్ అధికారులు..!!
- కువైట్ సహా నాలుగు దేశాల్లో భారత కాన్సులర్ సేవలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.!!







