క్యుఎన్సిసిలో భారత సింగర్ ప్రదర్శన
- December 13, 2018దోహా: భారత మెలోడీ కింగ్ కుమార్ సాను, ఖతార్ రెసిడెంట్స్ని తన పాటలతో అలరించనున్నారు. ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 28న కుమార్ సాను సంగీత విభావరి జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఈవెంట్ని నిర్వహించనున్నారు. 'ఏ కాలి కాలి ఆంకేన్, ఏక్ లడ్కి కో దేఖా, ఆంకో కి గుస్తాకియాన్..' వంటి ఎన్నో అద్భుతమైన పాటలతో కుమార్ సాను, బాలీవుడ్ మెలోడీ కింగ్ అన్పించుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం పద్మ పురస్కారంతో కుమార్ సానుని గౌరవించింది. 24 గంటల్లో అత్యధిక పాటల్ని పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు దక్కించుకున్నారు కుమార్ సాను. కాగా, కుమార్ సాను సంగీత విభావరికి వెళ్ళాలనుకునేవారికి 75 ఖతారీ రియాల్స్ నుంచి 300 ఖతారీ రియాల్స్ ధరల్లో టిక్కెట్లు అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు