క్యుఎన్సిసిలో భారత సింగర్ ప్రదర్శన
- December 13, 2018
దోహా: భారత మెలోడీ కింగ్ కుమార్ సాను, ఖతార్ రెసిడెంట్స్ని తన పాటలతో అలరించనున్నారు. ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 28న కుమార్ సాను సంగీత విభావరి జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఈవెంట్ని నిర్వహించనున్నారు. 'ఏ కాలి కాలి ఆంకేన్, ఏక్ లడ్కి కో దేఖా, ఆంకో కి గుస్తాకియాన్..' వంటి ఎన్నో అద్భుతమైన పాటలతో కుమార్ సాను, బాలీవుడ్ మెలోడీ కింగ్ అన్పించుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం పద్మ పురస్కారంతో కుమార్ సానుని గౌరవించింది. 24 గంటల్లో అత్యధిక పాటల్ని పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు దక్కించుకున్నారు కుమార్ సాను. కాగా, కుమార్ సాను సంగీత విభావరికి వెళ్ళాలనుకునేవారికి 75 ఖతారీ రియాల్స్ నుంచి 300 ఖతారీ రియాల్స్ ధరల్లో టిక్కెట్లు అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









