తుపానుగా మరనున్న తీవ్రవాయుగుండం
- December 15, 2018అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. మరో 12 గంటల్లో ఇది తుపానుగా మరే అవకాశం ఉంది. శ్రీహరికోటకు 790 కిలోమీటర్ల దూరంలో.. చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్ర వాయుగుండం త్వరితగతిన దిశను మార్చుకుని కదులుతుంది. ఉత్తర కోస్తాలో కాకినాడ నుంచి విశాఖపట్నం మధ్య తీరం దాటే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం 17వ తేదీ రాత్రి తీరం దాటొచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం తీరం దాటే సమయంలో గంటలకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రంలో 6 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసి పడనున్నాయి. వాయుగుండం మార్పులను అనుక్షణం గమనిస్తున్న ఆర్టీజీఎస్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది.
తాజా వార్తలు
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన