ఓఎడూ విలేజ్‌ని సందర్శించిన 70 వేల మంది

- December 23, 2015 , by Maagulf
ఓఎడూ విలేజ్‌ని సందర్శించిన 70 వేల మంది

ఖతార్‌ నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా కటారాలోని ఓరెడూ విలేజ్‌లో నిర్వహించిన కార్యక్రమాలను 70 వేల మంది తిలకించినట్లుగా అధికారికవ ర్గాలు వెల్లడించాయి. కటారా నేషనల్‌ డే ఉత్సవాలు కల్చరల్‌ విలేజ్‌లో జరిగాయి. ఓరెడూ సంస్థ ఈ కార్యక్రమాల్ని నిర్వహించింది. ఇందులో ఎగ్జిబిషన్‌ సందర్శకుల్ని బాగా ఆకట్టుకుంది. ఓరెడూ విలేజ్‌ డిసెంబర్‌ 18, 19 తేదీల్లో సందర్శకుల్ని విశేషంగా ఆకర్షించింది. ట్రెడిషనల్‌ మ్యూజిక్‌, లైవ్‌ కుకింగ్‌ మరియు టెక్నాలజీ సెక్షన్‌, క్రాఫ్ట్‌ సెక్షన్స్‌కి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. అలాగే పిల్లల్ని అలరించే కార్యక్రమాలు కూడా సందర్శకుల్ని ఆకర్షించాయని నిర్వాహకులు తెలిపారు. 'వి ఆర్‌ అల్‌ ఖతార్‌' క్యాంపెయిన్‌కి స్పందన బాగా లభించింది. ఖతార్‌కి చెందిన ప్రముఖ కళాకారులతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com