'ఫోరమ్‌ ఎగైనెస్ట్‌ టెర్రరిజం'లో పాల్గొన్న సౌదీ అరేబియా

- December 20, 2018 , by Maagulf
'ఫోరమ్‌ ఎగైనెస్ట్‌ టెర్రరిజం'లో పాల్గొన్న సౌదీ అరేబియా

జెడ్డా: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన 9వ సెషన్‌ గ్లోబల్‌ కౌంటర్‌ టెర్రిజం ఫోరమ్‌ వర్క్‌ షాప్‌లో మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ - మొహమ్మద్‌ నైఫ్‌ సెంటర్‌ ఫర్‌ కౌన్సిలింగ్‌ అండ్‌ కేర్‌ - జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ కంబాటింగ్‌ ఎక్స్‌ట్రిమిజమ్‌ నేతృత్వంలోని సౌదీ బృందం పాల్గొనడం జరిగింది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రభుత్వాలు ఈ ఈవెంట్‌ని కో-ఛెయిర్‌ చేశాయి. సౌదీ అధికారులు, టెర్రరిజంని రూపుమాపేందుకు తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. ప్రపంచ శాంతి కోసం తాము కట్టుబడి వున్నామని వివరించారు. యూఎన్‌ సెక్రెటరీ కౌన్సిల్‌ సూచనల మేరకు డయీష్‌, అల్‌ ఖయీదా విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com