ఎన్ఐఏ సోదాలు.. ఐసిస్తో లింకున్న అయిదుగురి అరెస్టు
- December 26, 2018న్యూఢిల్లీ: భారత్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు లింకున్న ఓ గ్రూపు కొత్త తరహా మాడ్యూల్ను నిర్వహిస్తున్నది. ఆ కేసుకు సంబంధం ఉన్న 16 చోట్ల ఇవాళ ఎన్ఐఏ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అయిదుగుర్ని అరెస్టు చేశారు. మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీతో పాటు యూపీలోని కొన్ని ప్రాంతాలు ఈ దాడులు కొనసాగుతున్నాయి. హర్కత్ ఉల్ హర్బ్ ఇ ఇస్లామ్ అనే సంస్థ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నది. యూపీలోని అమ్రోహా కేంద్రంగా హర్కత్ సంస్థ పనిచేస్తున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది. కొత్త తరహా ఉగ్ర మాడ్యూల్ను నిర్వహిస్తున్న ఓ మౌలానాతో పాటు సివిల్ ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ కొత్త మాడ్యూల్కు సూత్రధారులని ఎన్ఐఏ నిర్ధారించింది. వచ్చే నెలలో జరగనున్న రిపబ్లిక్ డే సంబరాలకు ముందు దేశ రాజధానితో పాటు యూపీలోని పలు చోట్ల దాడులకు ప్లానేసినట్లు ఎన్ఐఏ పేర్కొన్నది. దాడులు నిర్వహించిన పోలీసులు.. వివిధ ప్రాంతాల నుంచి అమోనియం నైట్రేట్, పిస్తోళ్లను రికవర్ చేశారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..