ఎన్ఐఏ సోదాలు.. ఐసిస్తో లింకున్న అయిదుగురి అరెస్టు
- December 26, 2018
న్యూఢిల్లీ: భారత్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు లింకున్న ఓ గ్రూపు కొత్త తరహా మాడ్యూల్ను నిర్వహిస్తున్నది. ఆ కేసుకు సంబంధం ఉన్న 16 చోట్ల ఇవాళ ఎన్ఐఏ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అయిదుగుర్ని అరెస్టు చేశారు. మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీతో పాటు యూపీలోని కొన్ని ప్రాంతాలు ఈ దాడులు కొనసాగుతున్నాయి. హర్కత్ ఉల్ హర్బ్ ఇ ఇస్లామ్ అనే సంస్థ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నది. యూపీలోని అమ్రోహా కేంద్రంగా హర్కత్ సంస్థ పనిచేస్తున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది. కొత్త తరహా ఉగ్ర మాడ్యూల్ను నిర్వహిస్తున్న ఓ మౌలానాతో పాటు సివిల్ ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ కొత్త మాడ్యూల్కు సూత్రధారులని ఎన్ఐఏ నిర్ధారించింది. వచ్చే నెలలో జరగనున్న రిపబ్లిక్ డే సంబరాలకు ముందు దేశ రాజధానితో పాటు యూపీలోని పలు చోట్ల దాడులకు ప్లానేసినట్లు ఎన్ఐఏ పేర్కొన్నది. దాడులు నిర్వహించిన పోలీసులు.. వివిధ ప్రాంతాల నుంచి అమోనియం నైట్రేట్, పిస్తోళ్లను రికవర్ చేశారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు