ఎన్ఐఏ సోదాలు.. ఐసిస్తో లింకున్న అయిదుగురి అరెస్టు
- December 26, 2018
న్యూఢిల్లీ: భారత్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు లింకున్న ఓ గ్రూపు కొత్త తరహా మాడ్యూల్ను నిర్వహిస్తున్నది. ఆ కేసుకు సంబంధం ఉన్న 16 చోట్ల ఇవాళ ఎన్ఐఏ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అయిదుగుర్ని అరెస్టు చేశారు. మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీతో పాటు యూపీలోని కొన్ని ప్రాంతాలు ఈ దాడులు కొనసాగుతున్నాయి. హర్కత్ ఉల్ హర్బ్ ఇ ఇస్లామ్ అనే సంస్థ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నది. యూపీలోని అమ్రోహా కేంద్రంగా హర్కత్ సంస్థ పనిచేస్తున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది. కొత్త తరహా ఉగ్ర మాడ్యూల్ను నిర్వహిస్తున్న ఓ మౌలానాతో పాటు సివిల్ ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ కొత్త మాడ్యూల్కు సూత్రధారులని ఎన్ఐఏ నిర్ధారించింది. వచ్చే నెలలో జరగనున్న రిపబ్లిక్ డే సంబరాలకు ముందు దేశ రాజధానితో పాటు యూపీలోని పలు చోట్ల దాడులకు ప్లానేసినట్లు ఎన్ఐఏ పేర్కొన్నది. దాడులు నిర్వహించిన పోలీసులు.. వివిధ ప్రాంతాల నుంచి అమోనియం నైట్రేట్, పిస్తోళ్లను రికవర్ చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







