గిజా పిరమిడ్ల వద్ద పేలుడు

- December 29, 2018 , by Maagulf
గిజా పిరమిడ్ల వద్ద పేలుడు

కైరో: ఈజిప్టులో పర్యాటకులతో వెళ్తున్న బస్సును పేల్చారు. వియత్నం పర్యాటకులతో వెళ్తున్న బస్సును టార్గెట్ చేస్తూ పేలుడుకు పాల్పడ్డారు. ఆ పేలుడు వల్ల నలుగురు మృతిచెందారు. మరో 10 మంది గాయపడ్డారు. గిజా పిరమిడ్ల విహారయాత్రకు వచ్చిన పర్యాటకులను టార్గెట్ చేశారు. ఈ ఘటనలో టూరిస్టు గైడ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అల్ మారియోటా రోడ్డు వద్ద అమర్చిన పేలుడు పదార్థం విస్పోటనం చెందడంతో బస్సు అదుపు తప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com