కేరళ:1369 మంది అరెస్టు..
- January 04, 2019
తిరువనంతపురం: రెండు రోజుల క్రితం ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన తర్వాత కేరళ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు జరిగాయి. ఇవాళ కూడా అక్కడ బంద్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు సుమారు 1369 మందిని అరెస్టు చేశారు. మరో 717 మందిని ముందస్తుగా ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 801 కేసులను నమోదు చేశారు. మునుముందు మరికొంత మందిని అదుపులోకి తీసుకోనున్నట్లు కేరళ పోలీసులు చెప్పారు. భారీ హింస చోటుచేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలను కూడా ఎవరూ తెరవడం లేదు. పోలీసులు భద్రత కల్పిస్తేనే షాపులను తెరుస్తామని యజమానులు అంటున్నారు. దాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించినా.. తగినంత భద్రతను కల్పించలేకపోయారన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







