కేరళ:1369 మంది అరెస్టు..
- January 04, 2019
తిరువనంతపురం: రెండు రోజుల క్రితం ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన తర్వాత కేరళ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు జరిగాయి. ఇవాళ కూడా అక్కడ బంద్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు సుమారు 1369 మందిని అరెస్టు చేశారు. మరో 717 మందిని ముందస్తుగా ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 801 కేసులను నమోదు చేశారు. మునుముందు మరికొంత మందిని అదుపులోకి తీసుకోనున్నట్లు కేరళ పోలీసులు చెప్పారు. భారీ హింస చోటుచేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలను కూడా ఎవరూ తెరవడం లేదు. పోలీసులు భద్రత కల్పిస్తేనే షాపులను తెరుస్తామని యజమానులు అంటున్నారు. దాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించినా.. తగినంత భద్రతను కల్పించలేకపోయారన్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







