కేరళ:1369 మంది అరెస్టు..

- January 04, 2019 , by Maagulf
కేరళ:1369 మంది అరెస్టు..

తిరువనంతపురం: రెండు రోజుల క్రితం ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన తర్వాత కేరళ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు జరిగాయి. ఇవాళ కూడా అక్కడ బంద్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు సుమారు 1369 మందిని అరెస్టు చేశారు. మరో 717 మందిని ముందస్తుగా ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 801 కేసులను నమోదు చేశారు. మునుముందు మరికొంత మందిని అదుపులోకి తీసుకోనున్నట్లు కేరళ పోలీసులు చెప్పారు. భారీ హింస చోటుచేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలను కూడా ఎవరూ తెరవడం లేదు. పోలీసులు భద్రత కల్పిస్తేనే షాపులను తెరుస్తామని యజమానులు అంటున్నారు. దాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించినా.. తగినంత భద్రతను కల్పించలేకపోయారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com